ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న కూటమి ప్రభుత్వం...
ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న కూటమి ప్రభుత్వంవిశాఖపట్నం ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన రౌడీషీట్ ను వెంటనే ఎత్తివేయాలి
విద్యార్థి,నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భా రత యువజన సమాఖ్య నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం రౌడీషీట్ ను ఓపెన్ చేయడం దు ర్మార్గమని ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.బుధవారం నాడు సిఆర్ భవన్ లో జరిగిన విలేకర్ల ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు,ఏఐఎస్ఎఫ్ జి ల్లా అధ్యక్షులు డి.సోమన్న మాట్లాడు తూ విద్యార్థులకు యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హా మీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహిస్తున్న ఏఐఎస్ఎఫ్,ఏఐ వైఎఫ్ నాయకులపై ఉద్యమాలకు సంబంధించిన పాతకేసులు తోడి నేడు విశాఖపట్నం లో ఐదు మంది విద్యార్థి యువజన నాయకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి సిగ్గుచేటని ఈ ఆలోచనలో తక్షణమే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.విద్యార్థి యువ జ న నాయకత్వం రెండు సంవత్సరాలక్రితం వైసీపీ ప్రభుత్వం బైజు సంస్థతో చేసుకున్న ఒ ప్పందాన్ని రద్దు చేయాలని చెప్పారు.ఆందోళన చేసిన నాయకులపై అప్పటి ప్రభుత్వం కే సు పెట్టడం జరిగింది.నేడు రెండు సంవత్సరాల తర్వాత పాత కేసులు అన్నీ తోడి విద్యార్థి యువజన నాయకులపై విశాఖపట్నంలో రౌడీషీట్ ఓ పెన్ చేశారని మండిపడ్డారు.మన ప్ర భుత్వం అధికారంలోకి వస్తే పాతకేసులు తొలగిస్తామని అనేక సభలు,సమావేశాలలో ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,తన కుమారుడు నారా లోకేష్ ఎన్నికల సమయంలో వి ద్యార్థులు,యువజనలు,ఉపాధ్యాయులు,కార్మికులకు ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో అ నేక సంఘాలకు హామీలు ఇచ్చారు.నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లను అణిచివేయా లని ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు ఈ రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదనే ఉ ద్దేశ్యంతో రా ష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఒక హిట్లర్ పరిపాలనను తలపిస్తూ రౌడీ షీట్లు,పీడీ యాక్ట్ ఓపెన్ చేసి ఉద్యమాలను అణిచివేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డా రు.విద్యార్థి సంఘాల నాయకులు హత్యలు,మానభంగాలో చేయలేదని విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఉద్యమాలు చేస్తున్న నాయకులపై మీ ప్రభుత్వం రౌడీ షీట్ ఓపెన్ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.తమ హక్కులపై ప్రశ్నిస్తున్న విశాఖ పట్నం ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టిన రౌడీషీట్ ను వెంటనే ఎత్తివేయాలని డి మాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐవై ఎఫ్ నగర కార్య దర్శి బీసన్న,ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి అశోక్,ఏఐఎస్ఎఫ్ కోశాధికారి వీరేష్,ఏఐవైఎఫ్ నాయకులు చంటి,ఏఐఎస్ఎఫ్ నాయకులు గోవిందరాజు,విక్రమ్,తదితరులు పాల్గొన్నా రు.
Comments
Post a Comment