విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరో సా...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...
విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా
విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ
విజిబుల్ పోలీసింగ్ ను బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాం త్ పాటిల్ ఆదేశించారు.మంగళవారం జిల్లా లో ప్రజల భద్రత,శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు 'విజిబుల్ పోలీసింగ్'కార్యక్రమాన్ని విస్తృ తం గా నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా పోలీ సులు ప్రజలకు మరింత చేరువవుతూ,నేరాల ను నియంత్రించడం, రహదారి భద్రతపై అవగా హన కల్పించడం వంటి చర్యలు చేపడుతు న్నారు.
వాహనాల తనిఖీలు :
అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తని ఖీ చేస్తున్నారు.ముఖ్యంగా నిషేధిత వస్తువు లు,గంజాయి వంటి వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నా రు.
సైబర్ నేరాలపై అవగాహన :
ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉం డేందుకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.తెలియని లింకులను క్లిక్ చేయవద్దని,వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దని సూచిస్తున్నారు.
రహదారి భద్రత నిబంధనలు :
రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారు.ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని,కారు డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
రహదారి భద్రత నియమాల ఉల్లంఘనలపై చర్యలు :
మైనర్ డ్రైవింగ్ చేయకూడదని,సెల్ ఫోన్ డ్రై వింగ్,డ్రంకెన్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్య లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరిస్తున్నారు.అలాగే,ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించు కుంటే కూడా చర్యలు తప్పవని స్పష్టం చేస్తు న్నారు.ప్రజలు భద్రతకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే స్ధానిక పో లీసులకుగాని,డయల్ 112కుగాని,లేదా డయ ల్ 100గాని సమాచారం ఇవ్వాలని సూచిస్తు న్నారు.
Comments
Post a Comment