స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపించదు...ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...
స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపించదుప్రజలు భయపడాల్సిన అవసరం లేదుజిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపించదని,ప్రజలు భయప డాల్సిన అవస రం లేదని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి వైద్య బృందంతో సమీక్ష నిర్వహించారు.ఈ సం దర్భంగా వ్యాధి వ్యాప్తి గురించి కలెక్టర్ ఆరా తీశారు.నవంబర్ నెల,ఈ రోజు వరకు 44 పాజిటివ్ కేసులు వచ్చాయని,అందరికీ చికిత్స అందించామని,39మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని,ప్రస్తుతం ఐదు మంది ఆసుపత్రిలో ఉన్నారని జీజీహెచ్ సూప రింటెండెంట్ వి వరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవ సరం లేదని,అప్రమ త్తంగా ఉంటే సరిపోతుందన్నారు.ఈ వ్యాధి తీవ్రమైనది కాదని,తక్షణ చికిత్సతో పూర్తిగా నయం అవుతుందని తెలిపా రు.ఒరియెంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని తెలిపారు.మైట్ అనే కీటకం కాటు వల్ల ఈ వ్యాధి వస్తుంద ని,ఏదైనా కాటు కనిపించిన వెంటనే సమీపంలోని స్థానిక పిహెచ్ సి,యుపిహెచ్ సికి వెళ్లి చికిత్స పొందాలని కలెక్టర్ సూచించారు.అధిక జ్వరం,తలనొప్పి,శరీర నొప్పులు,దద్దు ర్లు,కాటు దగ్గర నల్లరంగు పట్టు (ఎస్కార్) లక్షణాలు ఉంటాయని అన్నారు.జిజిహెచ్ క ర్నూలులో పరీక్ష చేసి కన్ఫర్మేషన్ చేసి,చికిత్స చేస్తారని తెలిపారు.రైతులు పొలాల్లో,పొ దల్లో ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాలని,పూర్తిగా ఒంటిని కప్పే ఫుల్ షర్టులు,వ్యవసాయం లో ఫుల్ రబ్బరు బూట్లు, ప్యాంట్ లు ధరించాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశం లో జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు,జనరల్ మెడిసిన్ హెచ్.ఓ.డి.డాక్టర్ శ్రీ రాములు,చిన్నపిల్లల విభాగపు హెచ్.ఓ.డి.డాక్టర్ విజయనంద్ బాబు,పల్మనాలజీ హెచ్. ఓ.డి డాక్టర్ శ్రీకాంత్,జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారి డా.ఉమాదేవి,ఇతర వైద్య బృందం పాల్గొన్నారు.
Comments
Post a Comment