స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపించదు...ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపించదు
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :
స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపించదని,ప్రజలు భయప డాల్సిన అవస రం లేదని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి వైద్య బృందంతో సమీక్ష నిర్వహించారు.ఈ సం దర్భంగా వ్యాధి వ్యాప్తి గురించి కలెక్టర్ ఆరా తీశారు.నవంబర్ నెల,ఈ రోజు వరకు 44 పాజిటివ్ కేసులు వచ్చాయని,అందరికీ చికిత్స అందించామని,39మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని,ప్రస్తుతం ఐదు మంది ఆసుపత్రిలో ఉన్నారని జీజీహెచ్ సూప రింటెండెంట్ వి వరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవ సరం లేదని,అప్రమ త్తంగా ఉంటే సరిపోతుందన్నారు.ఈ వ్యాధి తీవ్రమైనది కాదని,తక్షణ చికిత్సతో పూర్తిగా నయం అవుతుందని తెలిపా రు.ఒరియెంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని తెలిపారు.మైట్ అనే కీటకం కాటు వల్ల ఈ వ్యాధి వస్తుంద ని,ఏదైనా కాటు కనిపించిన వెంటనే సమీపంలోని స్థానిక పిహెచ్ సి,యుపిహెచ్ సికి వెళ్లి చికిత్స పొందాలని కలెక్టర్ సూచించారు.అధిక జ్వరం,తలనొప్పి,శరీర నొప్పులు,దద్దు ర్లు,కాటు దగ్గర నల్లరంగు పట్టు (ఎస్కార్) లక్షణాలు ఉంటాయని అన్నారు.జిజిహెచ్ క ర్నూలులో పరీక్ష చేసి కన్ఫర్మేషన్ చేసి,చికిత్స చేస్తారని తెలిపారు.రైతులు పొలాల్లో,పొ దల్లో ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాలని,పూర్తిగా ఒంటిని కప్పే ఫుల్ షర్టులు,వ్యవసాయం లో ఫుల్ రబ్బరు బూట్లు, ప్యాంట్ లు ధరించాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశం లో జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు,జనరల్ మెడిసిన్ హెచ్.ఓ.డి.డాక్టర్ శ్రీ రాములు,చిన్నపిల్లల విభాగపు హెచ్.ఓ.డి.డాక్టర్ విజయనంద్ బాబు,పల్మనాలజీ హెచ్. ఓ.డి డాక్టర్ శ్రీకాంత్,జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారి డా.ఉమాదేవి,ఇతర వైద్య బృందం పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...