హైదరాబాద్ శాంతిభద్రతలు ప్రశ్నార్థకం !...
హైదరాబాద్ శాంతిభద్రతలు ప్రశ్నార్థకం !
హైదరాబాద్లో గత వారం రోజుల్లో నగ రంలో ఐదు సంచలన హత్యలు జరిగా యి.ఇద్దరు రియల్టర్ల హత్యలు,ఒక యువతి గొంతు కోసిన దారుణం చోటు చేసుకున్నాయి.కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరంలో సంచలనాత్మక నేరాలు జరుగుతూనే ఉంటాయి.ఆవేశంలో జరిగే నేరాలను పోలీసులు కూడా అడ్డుకోలే కపోవచ్చు కానీ పాత నేరస్తులు ప్లాన్ చేసి మ రీ హత్యలకు పాల్పడుతూంటే..ఆపలేకపో వడం మాత్రం పోలీసుల వైఫల్యం అవుతుంది.
వ్యక్తిగత వివాదాలతోనే ఎక్కువ హత్యలు :
ఇటీవలి హత్యలన్నీ వ్యక్తిగత శత్రుత్వా లు,ప్రేమ వైరాలు,ఆస్తి వివాదాలతో ముడిపడి ఉంటున్నాయి.డిసెంబర్,11న ముషీరాబాద్లో 17ఏళ్ల పవిత్రను కత్తితో పొడిచి చంపిన యువకుడు ఆమెకు దగ్గ రి బంధువే.డిసెంబర్,3న యాకుత్ పురలో రియల్టర్ జునైద్ను హత్య చేసిన వారు ఆస్తి వివాదంలో ఉన్న కుటుంబ స భ్యులే.ఈ రకమైన పరిచయస్తుల చేతు ల్లోనే ఎక్కువ మంది హతమవుతున్నా రు.వ్యాపార వివాదాలతో మరికొంత మంది శత్రువుల్ని చంపడానికి వెనుకా డటం లేదు.
పాతికేళ్ల పగతో రియల్టర్ హత్య :
తన తండ్రి ఎన్ కౌంటర్ కు...ఓ వ్యక్తి కారణం అని అతని కొడుకు గుర్తుంచు కుని పాతికేళ్ల తర్వాత ఆ వ్యక్తిని చంపే శాడు.ఈ వ్యవహారం సంచలనం అయిం ది.ఇలాంటి ప్లాన్డ్ మర్డర్స్ విషయంలో పోలీసులు చురుగా ఉండలేకపోతున్నా రు.పాతనేరస్తులపై నిఘా తగ్గిపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నా యన్న ఆరోపణలు వస్తున్నాయి.
వేగంగా స్పందిస్తున్న పోలీసులు :
సంచలన హత్య కేసుల్లో పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు.48గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుంటు న్నారు.సీసీటీవీ ఫుటేజ్,మొబైల్ టవర్ డంప్ డేటా,డిజిటల్ ఎవిడెన్స్తో కేసులు వేగంగా ఛేదిస్తున్నారు.కానీ నేరంగా జరిగి పోయిన తర్వాత చర్యలు తీసుకోవడం కన్నా..నేరం చేయాలంటేనే నేరస్తులు భ యపడేలా చేయాల్సి ఉంటుంది.అప్పుడే క్రైమ్ రేట్ పెరుగుతుంది.యథేచ్చగా ప్రతీ కారాలు తీర్చుకునే పరిస్థితి ఉందని అను కుంటే నేరమనస్థత్వం ఉన్న వారికి ధైర్యం వస్తుంది.రియల్ ఎస్టేట్ వివాదాల్లో రౌడీషీ టర్ల పాల్గొనడం,మహిళలపై లైంగిక నేరా లు,పిల్లలపై పోక్సో కేసులు ఇంకా ఆందో ళన కలిగిస్తున్నాయి.భూమి గొడవల్లో రాజకీయ నాయకుల కుటుంబాల ప్రమే యం,ఆ తర్వాత పోలీసు బదిలీలు ఇవ న్నీ ప్రజల్లో అపనమ్మకం కలిగిస్తున్నాయి. పోలీసులు శాంతిభద్రతల అంశంలో మ రింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంద న్న అభిప్రాయం సామాన్య ప్రజల నుంచి వస్తోంది.
Comments
Post a Comment