గుండెపోటుతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం...
గుండెపోటుతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబు ల్గా విధులు నిర్వహిస్తున్న ఎర్రోజు దేవేందర్ (53) గుండెపోటు కారణంగా సోమవారం మృతి చెందారు.హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ కరీంనగర్లోని గాంధీ చౌరస్తాలో మధ్యాహ్నం 1 2-00గంటల వరకు ట్రాఫిక్ విధులు నిర్వహించారు.విధులు ముగించుకుని ఇంటికి చే రుకున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.తక్షణమే కుటుంబ సభ్యులు ఆయన ను ఆసుపత్రికి తరలించగా,అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.199 2లో ఏఆర్ కానిస్టేబుల్గా పోలీసు శాఖలో చేరిన దేవేందర్,ఆ తర్వాత సివిల్ పోలీసు కానిస్టేబుల్గా కన్వర్షన్ పొంది,ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్గా తన సేవలు అందిస్తున్నా రు.మృతుడికి భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు.ఈ ఘటనపై కరీంనగర్ పోలీస్ కమీష నర్ గౌష్ ఆలం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మృతి పట్ల ఆయన సంతాపం తెలియజేశారు.అదేవిదంగా విషయం తెలిసిన వెంటనే ట్రా ఫిక్ ఏసీపీ,సీఐలు,ఎస్ఐలు,తదితర పోలీసు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని మృ తుడి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి ప్రకటించారు.
Comments
Post a Comment