ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ...
ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం సంద ర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యా ప్తంగా మంగళవారం వివిధ జిల్లాల కలెక్టరేట్ల ఆవరణలో ఏర్పాటు చేసిన తెలం గాణ తల్లి విగ్రహాలను వర్చు వల్ గా ఆవిష్కరించారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.రాష్ట్రంలోని 33 కలెక్ట రేట్లలో రూ.5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహా లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రులు కార్య క్రమానికి హాజరయ్యారు.మొత్తం 18 అడుగు ల ఎత్తుతో విగ్రహాల నిర్మాణం జరిగింది.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ జరగడం ఆనందం గా ఉందన్నారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవా లను పురస్కరిం చుకొని భూపాలపల్లి జిల్లాలో ఈ వేడుకలు ఘ నంగా ప్రారంభమయ్యాయి.జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ రాహుల్ శర్మ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.తెలంగాణ తల్లికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రతి ఏటా 9వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి,ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment