అనుమానంతో యువతిని హత్య చేసిన మేనమామ...
అనుమానంతో యువతిని హత్య చేసిన మేనమామ
హైదరాబాద్ నగరం,ముషీరాబాద్లో సోమవారం మధ్యాహ్నం దారుణ సంఘ టన చో టుచేసుకుంది.బాపూజీనగర్కు చెందిన పవిత్ర అనే యువతిని ఆమె మేనమామ ఉమాశం కర్ కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా విషాదాన్ని నెలకొల్పింది.పవిత్ర మే నత్త తెలిపిన వివరాల ప్రకారం,చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఉమాశంకర్ ను పవిత్ర తండ్రే ఆశ్రయించాడు.వారిద్దరి మధ్య సన్నిహితం పెరిగి,భవిష్యత్తులో పెళ్లి చే సుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు.అయితే కొంతకాలంగా పవిత్రపై ఉమా శంకర్కు అనుమానాలు పెరిగాయి.ఈ అనుమానంతోనే ఆమెను బయటికి వెళ్లని వ్వకుండా నియం త్రించడంతో పాటు,ఇంటర్లో ఉండగానే ఆమె చదువు కూడా ఆపించాడు.ఇటీవలి రోజు ల్లో పవిత్ర తన తల్లిదండ్రులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లింది.దీనిపై ఆగ్ర హించిన ఉమాశంకర్,సోమవారం పవిత్ర ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగాడు.గొడవలో ప విత్ర “పెళ్లి చేసుకోను” అని చెప్పడంతో ఆగ్రహించిన ఉమాశంకర్,ముందే తెచ్చుకున్న క త్తితో దాడి చేసి అక్కడికక్కడే హత్యకు పాల్పడ్డాడు.దాడి సమయంలో పవిత్ర తల్లి,చెల్లి ఇంట్లో ఉన్నప్పటికీ,అకస్మాత్తుగా జరిగిన దాడిని ఆపలేకపో యారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.స్థానికులు ఆత్మ హత్యా ఆలోచనలు,అను మానాలు,సంబంధాలలో హింస పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు ఆందో ళన కలిగిస్తున్నాయని తెలిపారు.
Comments
Post a Comment