కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం...ప్రమా దంలో వ్యక్తి దారుణ మృతి...
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదంప్రమాదంలో వ్యక్తి దారుణ మృతి
కర్నూలు నగరం,మెడికల్ కళాశాల వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి...కర్నూలు నగరం,సం జయ్ గాంధీనగర్ కు చెందిన సూర్య పోగు మదన్ కుమార్ అలియాస్ చిన్న (34) గతంలో ఎల్ ఐసిలో పనిచేశాడు.నేడు న గరంలోని సర్వీస్ సెంటర్ నుండి అతను ద్విచక్ర వాహ నం ను తీసుకుని రాజవిహార్ మీ దుగా జిల్లా కలెక్ట రేట్,సంజయ్ గాంధీనగర్ లోని తన గృహానికి బయలు దేరాడు.
మార్గమధ్యంలో మెడికల్ కళాశాల ప్రాంతంలో జయరాజ్ స్టీల్స్ (AP-39-WA-52 20) బస్సు అతివేగంతో వెనుక వైపు నుండి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.ప్రమాదం లో మదన్ కుమార్ తలపై బస్సు వెళ్లడంతో తలఛిద్రం అయి,అక్కడికక్కడే మృతి చెందా డు.మృతుడికి భార్య,కుమారుడు ఉన్నారు.మరోవైపు ప్రస్తుతం భార్య ఏడు నెలలు గర్భిణీ గా ఉంది.సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని,మృ తదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.మృతుడి తల్లి పిర్యాదు మేరకు ట్రాఫిక్ పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Post a Comment