సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో...ఏపీ సీఎం చంద్రబాబు...
సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో
ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.ఈ మేరకు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ)పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేశారు.పారదర్శక పాలన అందించడంతో పాటు,ప్రభుత్వ పని తీరుపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే అవసరం లేకుండా అన్ని సేవలను అందించాలని సీఎం నిర్దేశించారు.ఇందు కు 'మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్'ను సమర్థంగా వినియోగించుకోవాలని,దీని పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించా లని సూచించారు.ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని, అవి వెంటనే తమ పద్ధతి మార్చుకుని ఆన్లైన్ బాట పట్టాలని చంద్రబాబు అ న్నారు.రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యుమెం ట్లను కొరియర్ ద్వారా నేరుగా లబ్ధిదా రుల ఇళ్లకే పంపాలని సూచించారు. ఆర్టీసీ బస్టాండ్ లు,ముఖ్యంగా టాయి లెట్ల వద్ద పరిశుభ్రతకు పెద్దపీట వేయాల ని,ప్రయాణికులకు మెరుగైన సేవలు అం దించాలని ఆదేశించారు.భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరుగు తుందని,వాటి సేవలను మరింత విస్తృ తం చేసేందుకు ఒక మాస్టర్ ప్లాన్ రూపొం దించాలని చెప్పారు.పురుగు మందుల వాడకాన్ని తగ్గించేందుకు డ్రోన్లను ఎలా ఉపయోగించవచ్చో రైతులకు అవగాహ న కల్పించాలని తెలియచేశారు.
Comments
Post a Comment