ఏపీ ప్రభుత్వ ప్రకృతి వైద్య సలహాదారుగా డా. మంతెన సత్యనారాయణ రాజు నియామ కం...
ఏపీ ప్రభుత్వ ప్రకృతి వైద్య సలహాదారుగా
డా. మంతెన సత్యనారాయణ రాజు నియామకం
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ప్రముఖ ప్రకృతి వైద్యరంగ నిపుణులు డా.మంతెన సత్యనారాయణ రాజును ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకృతి వైద్య విధానాలను ప్రజలకు మరింత చేరువ చేయడం,ఆరోగ్య జీవన విధానాలపై అవగాహన పెంపొందించడం,ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు మార్గదర్శనం చేయడం ల క్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.డా.మంతెన సత్యనారాయణ రాజుకు ప్రకృతి వైద్య రంగంలో ఉన్న విశాల అనుభవం,పరిశోధన,ప్రజారోగ్యంపై ఆయన చేసిన సేవలు ఈ నియామకానికి కారణమయ్యాయని ప్రభుత్వం పేర్కొంది.రాష్ట్రంలో ప్ర కృతి వైద్యాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తార ని ఆశాభావం వ్యక్తం చేసింది.ఈ నియామకంతో ఏపీ రాష్ట్రంలో ఆరోగ్యకర జీవన విధా నాలు,సహజ వైద్య పద్ధతులకు మరింత ప్రాధాన్యత లభించనున్నట్లు అభిప్రాయం వ్యక్తమ వుతోంది.
Comments
Post a Comment