కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలి... జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...
కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలిమున్సిపల్ కమిషనర్,అధికారులతో సమీక్షమౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధంకేంద్ర,రాష్ట్ర పథకాల సమర్థ వినియోగంజిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేం దుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని జి ల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్,ఇంజనీరింగ్,పట్టణ ప్రణాళిక విభాగాల సిబ్బందితో కర్నూ లు స్మార్ట్ సిటీ అంశంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.నగర అభివృద్ధికి అవసరమైన దీర్ఘ కాలిక ప్రణాళికలు,అమలు విధానాలు,మౌలిక వసతుల విస్తరణపై కలెక్టర్ దృష్టిసారించా లని సూచించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించి త్రాగు నీటి నిరంతర సరఫరా,అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ,పచ్చదనం పెంపు,పార్కులు,రవాణా వ్యవస్థ,ఔటర్ రింగ్ రోడ్,ఫ్లై ఓవర్లు,కేసీ కెనాల్,తుంగభద్ర,హంద్రీ నదుల పరిశుభ్రత వంటి అంశాలను ప్రణాళికల్లో చేర్చాలని సూచిం చారు.జలశక్తి,అమృత్,పీఎం గతిశక్తి,స్వచ్ఛభా రత్,స్వదేశ దర్శన్,నేషనల్ గ్రీన్ ఎయిర్ వంటి కేంద్ర పథకాల నుండి నిధులు పొందేలా శాఖల సమన్వయంతో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పం పాలని సూచించారు.
మార్చి నెలాఖరులోపు అన్ని డీపీఆర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు దిశానిర్దేశం చేశా రు.ప్రణాళికల రూపకల్పనలో మంత్రి టీజీ భరత్,ఇన్చార్జి మంత్రి, పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు సూచనలను కూడా తీసుకో వాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమావే శంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనా థ్,ఇన్చార్జి సిటీ ప్లానర్ వెంకట రమణ,టీపీ ఎస్ అంజాద్ బాషా,డీఈలు గిరిరాజ్,పవన్, కుమార్ రెడ్డి,శ్రీనివాసన్,అసిస్టెంట్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment