నల్గొండలో ఎక్సైజ్ పోలీసుల అరాచకాలు... వైన్ షాపులపై అక్రమ కేసుల ఆరోపణలు...
నల్గొండలో ఎక్సైజ్ పోలీసుల అరాచకాలు వైన్ షాపులపై అక్రమ కేసుల ఆరోపణలు
నల్గొండ జిల్లాలో ఎక్సైజ్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తిరుమల గిరి సాగర్ మండల కేంద్రంలో ఉన్న రెండు వైన్ షాపులపై అక్రమ కేసులు నమోదు చేస్తు న్నారని వైన్ షాప్ యజమానులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో తిరుమలగిరి సాగర్కు చెందిన వైన్ షాప్ యజమాని విద్యాసాగర్ రెడ్డి,ఎక్సైజ్ అధికారుల వేధింపులను నిరసిస్తూ పురుగుల మందు డబ్బాతో ఎక్సైజ్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగా రు.నిబంధనల ప్రకారమే వ్యాపారం చేస్తున్నప్పటికీ,కావాలనే తప్పుడు కేసులు పెట్టి ఇ బ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా పెద్దవూర మం డల కేంద్రంలో వైన్ షాప్ అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పటికీ,ఇప్పటివరకు షా ప్ ను ఓపెన్ చేయనివ్వకుండా ఎక్సైజ్ సీఐ కల్పన అడ్డంకులు సృష్టిస్తున్నారని యజమా నులు ఆరోపిస్తున్నారు.అనవసర తనిఖీలు,ఆలస్యం పేరుతో వేధింపులకు గురిచేస్తున్నార ని వారు వాపోతున్నారు.ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుతో తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటి ల్లుతోందని,ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వైన్ షాప్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Post a Comment