షోరూమ్ ముందే ఆటోను తగలబెట్టిన డ్రైవర్...
షోరూమ్ ముందే ఆటోను తగలబెట్టిన డ్రైవర్
రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన మోహన్ సోలంకి ఒక బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కొ న్నాడు.ఒకసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని మోహన్కి బజాజ్ సిబ్బంది చెప్పారు.మొదట 174 కిలోమీటర్ల రేంజ్ వచ్చిందట.అయితే ఇటీవల అది అకస్మాత్తుగా 7 0 నుంచి 74 కిలోమీటర్లకు పడిపోయిందని మోహన్ సోలంకి ఆరోపిస్తున్నాడు.బజాజ్ షోరూమ్ చుట్టూ ఎన్నిసార్లు తిగిరినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించా డు.ఈ సమస్యపై డిసెంబర్,14న సోలంకి తన ఆటోను గాడిదకు కట్టి లాగుతూ షోరూ మ్కు తీసుకువచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు.ఇక ఇప్పుడు షోరూ మ్ ముందే ఆటోను తగలబెట్టాడు.సోలంకి ఈ ఆటోను 17 నెలల క్రితం ఐదు లక్షలకు కొనుగోలు చే శాడు.రూ.70 వేలు డౌన్ పేమెంట్ చెల్లించి,మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.10,655 చొ ప్పున 48 వాయిదాలలో చెల్లించాల్సి ఉంది.ఇప్పటివరకు ఆయన 14వాయిదాలను పూ ర్తి చేశాడు.ఇప్పుడు షోరూమ్ దగ్గరికి తీసుకువచ్చి నడిరోడ్డు మీద ఆటోను తగలబెట్టాడు. అక్కడే ఉన్న సోలంకి భార్య కన్నీరుమున్నీరయ్యారు.సోలంకి సోదరుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.అయితే షోరూమ్ యాజమాన్యం మాత్రం మోహన్ సోలం కి ఆరోపణలను తోసిపుచ్చింది.ఆటో రేంజ్ సాధారణ పరిమితిలోనే ఉందని,కొత్త వాహనం కోసం డ్రైవర్ అనవసర ఒత్తిడి తెస్తున్నాడని వారు పేర్కొ న్నారు.
Comments
Post a Comment