నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో ప్రయాణికులను చేరవేయడాన్ని నిషేధించండి...CITU...
నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో ప్రయాణికులను చేరవేయడాన్ని నిషేధించండిఅనుమతి లేని టు వీలర్ పై చర్యలు తీసుకోండిఉప రవాణా కమిషనర్ కు సిఐటియు వినతి పత్రం అందచేత
కర్నూలు నగరంలో ప్రైవేటు సంస్థ అయిన రాపిడ్ ఆన్లైన్ యాప్ ద్వారా ప్రయాణికులను చే రవేయడానికి టూ వీలర్లను ఉపయోగించుకుని,వాటి ద్వారా ప్రయాణికులను చేరవేస్తు న్నారని టూవీలర్ ద్వారా ప్రయాణికులను చేరవే స్తున్న రాపిడ్ సంస్థను వెంటనే రద్దు చే యాలని సిఐటియు ఆటో యూనియన్ న్యూ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పి.తాండ్ర పా డు సమీపంలో ఆర్ టిఎ కార్యాలయం,కర్నూలు జిల్లా ఉపరవాణా కమిషనర్ ఎస్.శాంత కుమారికి వినతి పత్రం అందచేశారు.ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం సిఐటియు జి ల్లా ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్,ఆటో కార్మిక సంఘం సిఐటియు న్యూసిటీ ప్రధాన కార్య దర్శి బి.రాధాకృష్ణ మాట్లాడుతూ ఓలా,ఉబర్,రాపిడ్ లాంటి ప్రైవేట్ యాపులు పుట్టగొ డు గుల్లా పుట్టుకొచ్చి ఆటో కార్మికులను నిలువుదోపిడీ చేస్తున్నాయని అన్నారు. ఇదేకాక ప్ర యాణికులను చేరవేయడానికి ఎలాంటి అనుమతులు,అవకాశాలు లేని నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలైన టూ వీలర్లపై ప్రయాణికులను చేరవేస్తూ ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండి కొ డుతున్నారని వారు వివరించారు.కావున వీటిని తక్షణమే అరికట్టకపోతే పెద్దఎత్తున ఆం దోళన కార్యక్రమం చేస్తామని,అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు డి మాండ్ చేశారు.కర్నూలు ఉప రవాణా కమిషనర్ ఎస్.శాంత కుమారి మాట్లాడుతూ ప్రభు త్వం నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు ఎక్కడ లేదని,రాపిడ్ యాజమాన్యాన్ని పిలిచి చర్చిస్తా మని నిబంధనలు అతిక్ర మిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నగర అధ్యక్షులు ఎస్.హుస్సేన్ వలి,ఉపాధ్యక్షులు ఎస్. మాలిక్ భాషా,ఖలీల్ అహ్మద్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment