రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్...
రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్
VS9TV న్యూస్, హైదరాబాద్ :
హైదరాబాద్లో ఫిర్యాదుదారునికి సం బంధించిన ఒక సర్వే నంబర్పై సర్వే నివే దిక అందించేందుకు రూ.1,50,000 లం చం డిమాండ్ చేసిన దేవాదాయ శాఖ అ ధికారి ఏసీబీ వలలో చిక్కాడు.తెలంగాణ దేవాదాయ కమిషనర్ కార్యాలయంలోని సహాయ కమిషనర్ కార్యాలయంలో పని చేస్తున్న దేవాదాయ ఇన్స్పెక్టర్ ఆకవరం కిరణ్ కుమార్ లంచం తీసుకుంటూ తెలం గాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధి కారులకు పట్టుబడ్డాడు.డిమాండ్ చేసిన మొత్తంలో భాగంగా రూ.50,000 స్వీకరి స్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇన్స్పెక్టర్ను బహిరంగంగా అ రెస్టు చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికా రులు తెలిపారు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశా రు.ఎవరైనా ప్రభుత్వ సేవకులు లంచం డి మాండ్ చేసినట్లయితే వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 10 64 కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశా రు.
Comments
Post a Comment