వెనుజులపై అమెరికా ఉగ్రదాడిని ఖండించం డి...మధురో దంపుతులను తక్షణమే విడుద ల చేయాలి...సిపిఎం డిమాండ్....
వెనుజులపై అమెరికా ఉగ్రదాడిని ఖండిం చండి
మధురో దంపుతులను తక్షణమే విడు దల చేయాలి
సిపిఎం డిమాండ్.
వెనిజులాపై అమెరికా ఉగ్రదాడిని ఖండిం చాలని,మధురో దంపతులను తక్షణమే విడుదల చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. ఆదివారం వెనుజులా పై అమెరికా ఉగ్ర దాడిని ఖండిస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో న్యూసిటీ కార్యదర్శి టి.రాముడు అధ్యక్షతన నిరసన కార్య క్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ అమెరికా గత 20 సంవత్సరాల నుండి ఎలాగైనా వెరిజులాపై తన ఆధిపత్యాన్ని కొనసా గించాలనే కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని,ఈ దాడి అమెరికా సామ్రాజ్య వాదం యొక్క దాస్టికానికి ప్రతీకా అని విమర్శించారు.ఒక ప్రజాస్వామ్యయు తంగా ఎన్నికైన ఆ దేశ అధ్యక్షుడు మధు రోను బంధించి తీసుకొని వెళ్లడం దుర్మార్గ మని ఆయన విమర్శించాడు. ఎందుక య్యా దాడి చేశావంటే వెనుజులా దేశ అ ధ్యక్షుడు మధుర డ్రగ్స్ ను ఇతర దేశాల కు తరలిస్తున్నాడని ఇది ప్రమాదకరమైం దని అందుకోసమే దాడి చేశానని చెప్ప డం చాలా దారుణమని ఆయన తెలి పారు.వెనిజులాలో 20 సంవత్సరాల క్రితం అక్కడున్న అమెరికా తొత్తు ప్రభుత్వాన్ని ఓడించి యుగో చావేజ్ నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటిదాకా అమెరికా ఆధిపత్యంలో ఉన్న చమురు కంపెనీలన్నీ జాతీయం చేయడంతో అమెరికాకు వచ్చే ఆదాయం గండి పడిందని అన్నారు.అ ప్పటినుండి వెనిజులాపై అనేక కుట్రలు కుతంత్రాలు అమెరికా చేస్తుందని ఆయన విమర్శించారు.గత ఎన్నికల సందర్భంగా కూడా మధురో ఓడించడం కోసం అమె రికా సామ్రాజ్యవాదం చేయని ప్రయత్నం అంటూ లేదని అయినా అక్కడి ప్రజలు మధుర నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకున్నారని,అప్ప టినుండి ట్రంప్ ఎలాగైనా వెనిజు లాను తన ఆధీనంలో పెట్టుకోవాలని కుట్ర పన్నాడని చెప్పారు.గతంలో ఇలాగే సద్దాం హుస్సేన్ ను అణు రియాక్టర్లు ఉన్నాయని వాటిని అణు బాంబుల త యారీకి ఉపయోగించుకుంటున్నాడని నింద మోపి సద్దాం హుస్సేన్ ను అమెరికా సామ్రాజ్యవాదం అంతం చేసిందన్నారు. ఇప్పటి వరకు ఒక్క అణు రియాక్టర్ కూడా అక్కడ గుర్తించలేదన్నారు.అమె రికా వెనుజులాపై దాడి చేయడానికి ప్రధాన కారణం అక్కడున్న అపారమైన చమురు నిలువలే అని పేర్కొన్నారు. చమురు నిల్వలను జాతీయం చేసిన తర్వాత అమెరికా కుట్రలు సాగడం లేదని,అందుకోసమే అమెరికా వెనిజు లాలో ఎలాగైనా తన తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కుట్రలో భాగమే ఆ దేశంపై దాడి చేసి దేశ అధ్యక్షుడైన మధురోను నిర్బంధించాడని మండిప డ్డారు.తనకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలని కలలుగనే ట్రంపు ఇతర దేశాలపై ఈ రకంగా దాడి చేస్తే నోబుల్ శాంతి బహుమతి వస్తుందా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా అమెరికా సామ్రా జ్యవాదం తన తప్పును తెలుసుకొని తక్షణమే వెనిజులా అధ్యక్షుడు మధురో దంపతులను విడుదల చేయాలని,ఆ దేశంపై దాడులను ఆపాలని డిమాండ్ చేశారు.అలాగే భారతదేశం అలీన విధా నాన్ని పాటించే పద్ధతి గుర్తించి ఆ దేశానికి అండగా నిలవాలని ఆ రకంగా కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.దేశంలోని ప్రజాస్వామ్యవాదులు ఇలాంటి దాడులను ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.అలాగే ఈ నిర సన కార్యక్రమానికి హాజరై అమెరికా సామ్రాజ్యవాద దాడిని ఖండిస్తూ కర్నూలు నగరంలోని ప్రముఖ డాక్టర్లు భరత్,నాగభూషణం,రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్థిక విశ్లేషకుడు మన్సూర్ రహిమాన్ లు పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈ కా ర్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రామకృష్ణ,కె.వి.నారా యణ,ప్రజాశక్తి మేనేజర్ నరసింహ,సిఐటి యు నాయకులు వెంకట్ పాల్గొని మాట్లా డుతూ అమెరికా దాడిని ఖండించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర నా యకులు రఫీ,దివాకర్,పిపిఎస్ ఎస్ నా యకులు నాగరాజు,కెవిపిఎస్ నాయకు లు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment