న్యూ ఇయర్,సంక్రాంతి పర్వదినాలను పురస్క రించుకొని విజయవంతంగా ఆర్చరీ ఛాంపి యన్షిప్ ముగింపు...
న్యూ ఇయర్,సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని విజయవంతంగా ఆర్చరీ ఛాంపియన్షిప్ ముగింపు
జ్ఞాని ఆర్చరీ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఆదర్శ విద్యా మందిర్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఆర్చరీ ఛాంపియ న్షిప్ నిర్వహించారు.ఈ పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి దాదాపు 50నుంచి 60 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.కార్యక్రమానికి ఆదర్శ విద్యా మందిర్ హైస్కూల్ డైరెక్టర్ డాక్టర్ హరి కిషన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ గెలుపు–ఓటములు సహ జమే,కానీ క్రీడాస్ఫూర్తి మరియు క్రమశి క్షణే నిజమైన విజయం అని తెలిపారు. క్రీడాకారులు క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా బలంగా ఎదగాలని సూ చించారు.పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు డాక్టర్ హరికిషన్ చేతుల మీదుగా మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి,ఆర్చరీ కోచ్ ఎం.భరత్ కుమార్,వజ్ర రాజు,జాయింట్ సెక్రటరీ శ్రీరాములు,వ్యా యామ ఉపాధ్యాయుడు మౌలాలి, క్రీడా కారుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమా న్ని విజయవంతం చేశారు.ఈ ఆర్చరీ ఛాంపియన్షిప్ యువ క్రీడాకారుల్లో క్రీడా పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు.
Comments
Post a Comment