పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.. కమ్మరి పార్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్...
పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకమ్మరి పార్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరే షన్ చైర్ పర్సన్
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,41వ వార్డు,79,82వభూత్ లలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ ఆధ్వర్యంలో శనివారం పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటుచేశారు.
ఈ సందర్బంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ ప ర్సన్ కమ్మరి పార్వతమ్మ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను లబ్దిదారులకు పంపిణీ చేశారు.అ నంతరం పెన్షన్ ను సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి ఇస్తున్నారా? లేదా అనే విషయాన్ని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో 37వవార్డు ఇన్చార్జి సుతారు రాఘవేంద్ర,సీనియర్ కార్యకర్త ఇమ్మానియేలు,బూత్ ఇంచార్జీలు వెంకటేష్, బాలకృష్ణలు పాల్గొన్నా రు.
Comments
Post a Comment