విశ్వ బ్రాహ్మణ అభివృద్ధిపై వినతిని స్వీక రించిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమం,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ...
విశ్వ బ్రాహ్మణ అభివృద్ధిపై వినతిని స్వీకరించిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమం,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ
విజయవాడ,గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్ లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సం క్షేమం,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మని మర్యాద పూర్వకంగా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మోతడక వీరాచారి రాష్ట్రంలోని వి శ్వ బ్రాహ్మణుల అభివృద్ధి పట్ల వినతిపత్రం అందజేశారు.ఈ మేరకు కమ్మరి పార్వతమ్మ మాట్లాడారు.విశ్వ బ్రాహ్మణ సమాజానికి వచ్చే అభివృద్ధి పథకాలపై ప్రత్యేకంగా కృషి చే స్తామని అన్నారు.ముఖ్యంగా రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మణులు అన్నదాన సత్రాల్లో అభి వృద్ధి పనులకు ప్రత్యేక నిధులు,విశ్వ బ్రాహ్మణులు పూజారులుగా విధులు నిర్వహిస్తున్న దేవాల యాల్లో పూజారుల జీతభత్యాలు,ధూప దీప,నైవేద్యాలకు నిధులు కేటాయించాలని, అదే విదంగా వృత్తి పనులు నిర్వహిస్తున్న కార్పెంటర్లకు 500యూనిట్ల వరకు ఉచిత కరెం ట్,శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి,అన్ని గ్రామాల్లో విశ్వబ్రాహ్మణులకు బరియల్ గ్రౌండ్స్ కు ప్రత్యక నిధులు కేటాయించాలని విన తిపత్రంలో కోరినట్లు పేర్కొన్నారు.కావున తక్షణమే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ దృష్టికి తీసుకువెళ్లి, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కార్పొరేషన్ కి ప్రత్యేక నిధులు కేటాయిం పుకు కృషి చేస్తామని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమం,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ,నెల్లూరు అధ్యక్షులు సుబ్రమణ్యం,విజయవాడ పశ్చి మ నియోజక వర్గ యువ నాయకులు నాగబాబు,రాష్ట్ర ముఖ్య నాయకులు,నియోజక వ ర్గ నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment