ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు...లాడ్జీ ల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు... అనుమానితులపై నిఘా...
ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు
లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు
అనుమానితులపై నిఘా
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఏ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా నేరాల నియంత్రణకు,అనుమానాస్పద వ్యక్తుల ఆచూకి కనిపెట్టేందుకు ఆదివారం రాత్రి కర్నూలు పోలీసులు ఆకస్మికంగా పలు లాడ్జీలు,హోటళ్లలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టా రు.కర్నూలు,ఆదోని,పత్తికొండ,ఎమ్మిగ నూరు సబ్ డివిజన్ లలోని ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని లాడ్జీలు,హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఎన్ని రోజులుగా బస చేస్తున్నారని విచారణ చేసి,వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు,లాడ్జి రికార్డులను పోలీసు అధికారులు పరిశీలించారు.
Comments
Post a Comment