కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత... నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్...
కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యతనగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు.గురువారం నూతన సం వత్సరాన్ని పురస్కరించుకుని తన నివాస కార్యాలయంలో కార్మికులకు మిఠాయి బాక్సు లు అందజేసి నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలియజేశారు అంతకన్నా ముందు క మిషనర్ తన సతీమణి పి.చంద్రకళతో కలిసి కార్మికులకు అల్పాహారం వడ్డించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...ప్రజా రోగ్యం,ప్రాథమిక మానవ అవసరాలను సమ ర్థవంతంగా తీర్చడంలో కార్మికుల పాత్ర అమూల్యమైనదని పేర్కొన్నారు.అందుకే వారి సం క్షేమానికి నగరపాలక సంస్థ ఎప్పుడూ వెనకాడలేదన్నారు.కార్మికులకు వేతనాలు,కిట్లు వం టి సదుపాయాలు సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. నూత న సంవత్సర వేడుకలను కార్మికులతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నా రు.భవిష్యత్తులో కూడా కార్మికుల అభ్యున్నతికి చట్టపరిధిలో సాధ్యమైన అన్ని సౌకర్యాలు ఎటువంటి జాప్యం లేకుండా కల్పించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.అదేవిధం గా తహశీల్దార్ రవికుమార్,అదనపు కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ,డిప్యూటీ కమిషనర్ సతీ ష్ కుమార్ రెడ్డి, మేనేజర్ యన్.చిన్నరాముడు,కార్యదర్శి నాగరాజు,డిసిపి వెంకటరమణ, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగశివ ప్రసాద్,ఇంచార్జి ఎస్.ఈ.శేషసాయి,అకౌంట్స్ ఆఫీ సర్ మురళి,ఎగ్జామినర్ సుబ్రహ్మణ్యం,ఆర్ఓలు జునైద్,ఇశ్రాయేలు,డిప్యూటీ తహశీల్దార్ ధ నుంజయ,సూపరింటెండెంట్లు సుబ్బన్న,రామకృష్ణ,మంజూర్ బాష,వివిధ శాఖల అధికా రులు,కార్పొరేటర్లు కమిషనర్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Post a Comment