జిల్లా అధికారుల నిర్లక్ష్యమే వలసలకు కార ణం...కలెక్టర్ ముందస్తు చర్యలు శూన్యం... ఎస్ఎఫ్ఐ...

జిల్లా అధికారుల నిర్లక్ష్యమే వలసలకు కారణం
10,500 విద్యార్థులు వలసబాట
కలెక్టర్ ముందస్తు చర్యలు శూన్యం
ఎస్ఎఫ్ఐ

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
కర్నూలు జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జిల్లాలో 10,500 మంది విద్యార్థులు వ లస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యం.రంగప్ప గురువారం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక ప్రకటనలో తీవ్రంగా విమర్శించా రు.రాయలసీమ జిల్లాల్లో కర్నూలు జిల్లా ఇప్పటికే 90శాతం వలస ప్రభావిత ప్రాంతంగా ఉన్నప్పటికీ,రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా యంత్రాంగం వలసలను అరికట్టేందుకు ముందస్తు ని వారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని వారు తెలిపారు.జిల్లాలో 1 0,500 మంది విద్యార్థులు వలస వెళ్లారని జిల్లా కలెక్టర్ ప్రకటన నుంచే అధికారుల నిర్ల క్ష్యం స్పష్టంగా అర్థమవుతోందన్నారు.కర్నూలు జిల్లాలో పదోతరగతి చదువుతున్న విద్యా ర్థులకు 100శాతం హాజరు తప్పనిసరి అంటూ జిల్లా కలెక్టర్ సిరి గోనెగండ్ల పాఠశాలలో తనిఖీ చేసిన సందర్భంగా ఇచ్చిన ఒక పత్రికా ప్రకటనలో జిల్లావ్యాప్తంగా 10,500 మంది విద్యార్థులు వలస వెళ్లగా,అందులో 9,000మందిని తిరిగి రప్పించామని చెప్పడం జరి గింది.అయితే విద్యార్థులు వలస వెళ్లడానికి ప్రధాన కారణం విద్యాశాఖపై జిల్లా అధికారు లు సరైన దృష్టి పెట్టకపోవడమేనని స్పష్టం చేశారు.జిల్లాలో విద్యార్థులకు సరైన వసతి సౌకర్యాలు,హాస్టళ్లు,భోజనం,విద్యావసతులు కల్పించి ఉంటే తల్లిదండ్రులతో కలిసి వలస వెళ్లాల్సిన అవసరం ఉండేదే కాదన్నారు.జిల్లా అధికారుల పూర్తిస్థాయి నిర్లక్ష్యం కారణం గా విద్యార్థులు విద్యకు దూరమై జీవనోపాధి కోసం తల్లిదండ్రులతో పాటు వలస వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.వలసలకు వెళ్లే తల్లిదండ్రులకు బాలల హక్కులు,విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంలో కూడా జిల్లా అధికారులు విఫలమయ్యారని,ఫ లితంగా అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని తెలిపారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని వలసలను అరికట్టేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణా ళిక రూపొందించి,ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలపై విస్తృత ప్రచారం చేయాల ని,వాటి అమలుపై కఠిన పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు,అంజి జిల్లా సహాయ కార్యదర్శి రా ము జిల్లా నాయకులు పృథ్వీ,సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....