మద్యం మత్తులో స్నేహితుడి హత్య...
మద్యం మత్తులో స్నేహితుడి హత్య
చిలకలూరిపేట పట్టణంలోని రాగినిపాలెం ప్రాంతంలో ఆదివారం మద్యం మత్తులో తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీ సుకుంది.స్నేహితుడి చేతిలోనే మరో స్నేహితుడు హతమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.పట్టణంలోని రాగిని పాలెం జమ్మి చెట్టు సమీపంలో బోయిడి ప్రతాప్,నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు స్నేహితులు.వీరిద్దరూ ఉదయం నుంచి కలిసి మద్యం సేవించారు.అయితే, మద్యం మత్తులో ఉన్న సమయంలో ఇద్దరి మధ్య అకస్మాత్తుగా ఘర్షణ చోటుచేసుకుంది.ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో నాగరాజు ఆగ్రహంతో ఊగిపోయి,తన కత్తితో ప్రతాప్ గుండె కింద, పొట్ట భాగంలో బలంగా పొడిచా డు.తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రతాప్ కుప్పకూలి మృతి చెందాడు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థా నిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Post a Comment