ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త హత్య...నిజా మాబాద్ ఘటనలో సంచలన ట్విస్ట్...
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త హత్య
నిజామాబాద్ ఘటనలో సంచలన ట్విస్ట్
నిజామాబాద్లో భర్త హత్య కేసు సంచలన మలుపు తిరిగింది.ఇన్సూరెన్స్ డబ్బుల కోస మే భర్త పల్లటి రమేష్ను భార్య సౌమ్య,ఆమె ప్రియుడు దిలీప్ కలిసి హత్య చేసినట్లు పోలీ సుల విచారణలో తేలింది.మృతుడు పల్లటి ర మేష్పై రెండు కోట్లకుపైగా ఇన్సూరెన్స్ పాలసీ లు ఉన్నట్లు గుర్తించారు.ఈ ఇన్సూరెన్స్ డబ్బు లను పొందడంతో పాటు,వివాహేతర సంబం ధానికి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ హత్యకు పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీ సులు తెలిపారు.వివరాలు ఇలా ఉన్నాయి... సౌమ్య ప్లాన్ ప్రకారం రమేష్కు నిద్రమాత్రలు ఇచ్చిన అనంతరం గొంతు నులిమి హత్య చే సింది.ఈ ఘటనను సహజ మరణంగా చూపిం చేందుకు గుండెపోటుతో మృతి చెందినట్లు చి త్రీకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.అయితే మృతుడి తమ్ముడు అనుమానంతో పోలీసుల కు ఫిర్యాదు చేయడంతో శవానికి రీ పోస్టుమా ర్టం నిర్వహించారు.ఆ నివేదికల ఆధారంగా పో లీసులు విచారణను ముమ్మరం చేయగా,సం చలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.పోలీ సుల కఠిన వి చారణలో భార్య సౌమ్య,ఆమె ప్రి యుడు దిలీప్ హత్య చేసినట్లు అంగీకరించి నట్లు తెలిపారు.ప్రస్తుతం ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Post a Comment