రమేష్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిం చాలి..కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ యన్. సి.బజారన్న...

రమేష్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ యన్ సి బజారన్న

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా,తుగ్గలి మండలం,బొందిమడుగులకు చెందిన ఎంఆర్ పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఎన్ సి బజారన్న డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాల యం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు.గత శుక్రవారం బొందిమడుగులలో రమేష్ వాకింగ్ చేస్తుండగా దుండగులు వెనుక నుండి ట్రాక్టర్ తో గుద్ది కిందపడ్డ రమేష్ ను రాడ్లు, కత్తులతో దాడి చేశారని తీవ్రంగా గాయపడిన రమేష్ ను బంధువులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని అన్నారు.నేడు కోలుకోలేక అతను మృతి చెందడం బాధాకరం అని ఆయన కుటుంబ సభ్యులకు జిల్లా కాంగ్రెస్ కమిటీ తమ ప్రగాఢ సానుభూ తిని సంతాపం తెలియజేశారు.రమేష్ అణగారిన వర్గాల సమస్యలపై నిత్యం పోరాటం చే సేవాడని,రమేష్ ఒక ఎంఆర్పిఎస్ నాయకుడే కాకుండా అన్ని వర్గాల ప్రజా సమస్యలపై పోరాడి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించేవాడని చెప్పారు.ఇలాంటి దాడులు కేవలం దళితులపై ఎక్కువగా జరుగుతున్నాయని,ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి దాడులు ఎక్కువయ్యాయని,అదేవిదంగా దళిత మహిళల హత్యలు,అత్యాచారాలు అధి కంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఒక దళిత మహిళ ఆయన హోం మంత్రి గతంలో దళితులకు మహిళలపైన దాడు లు జరగకుండా అండగా ఉంటానని,వారికి రక్షణ కల్పి స్తానని మంత్రి పదవికి న్యాయం చేస్తానని రక్షణ మంత్రి వాగ్దానం చేసిన కూడా ఎక్కువ శాతం ఎస్సీ,ఎస్టీలపై హత్యలు,అత్యాచారాలు,దాడులు జరుగుతున్నాయని అన్నారు.మీ రు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశారు.అలాగే రమేష్ పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి వారి పైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు న మోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పారు.జిల్లా ఎస్ పి,జిల్లా కలెక్టర్ లు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.మృతి చెందిన రమేష్ కుటుం బానికి ఆర్థిక సహాయం,ప్రభు త్వం తరఫున అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్య క్రమంలో ఐఎన్టీయూసీ సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్,ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షులు ఈ.లాజరస్ పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....