ప్రియుడు దక్కలేదన్న కక్షతో హెచ్‌ఐవీ ఇంజెక్ష న్‌...డాక్టర్‌ భార్యపై ప్రాణాంతక దాడి చేసిన నర్సు...

ప్రియుడు దక్కలేదన్న కక్షతో హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌
డాక్టర్‌ భార్యపై ప్రాణాంతక దాడి చేసిన నర్సు
కర్నూలులో సభ్య సమాజాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
సినిమా కథను తలపించే ఓ భయానక ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసు కుంది.తెలంగాణ రాష్ట్రం ఇల్లెందులో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సిని మాలో చూపినట్లే,ప్రేమలో విఫలమైన ఓ మహిళ అసూయతో మరో మహిళ ప్రా ణాలపైకి తెచ్చింది.అయితే సినిమాలో తండ్రి పాత్రలో జరిగిన ఘోరం ఇక్కడ ఓ నర్సు చేతుల మీదుగా జరగడం గమనార్హం.కర్నూలు జిల్లా మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం ఓ మహిళా డాక్టర్‌ స్కూటీపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మోటార్‌ సైకిల్‌తో ఢీకొట్టారు. ఆమె కింద పడగానే అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు,ఓ వ్యక్తి సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆటో ఎక్కిస్తామని చెప్పారు. అదే సమయంలో ఆ మహిళా డాక్టర్‌కు ఓ ఇంజెక్షన్‌ చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే బాధిత వైద్యురాలు తన భర్తకు సమా చారం ఇచ్చి, తనపై విష ప్రయోగం జరి గిందని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు,సెల్‌టవర్‌ లొకేషన్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఘటన సమయంలో నలుగురు వ్యక్తులు అక్కడ ఉన్నట్లు గుర్తించి వారిని అదు పులోకి తీసుకున్నారు.పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుల్లో బీచుపల్లి బోయ వసుంధర అలియాస్‌ వేదవతి (కర్నూలు) ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.ఆమె గతంలో ఓ డాక్టర్‌ను ప్రేమించింది.అయితే ఆ డాక్టర్‌ ఆమెను కాకుండా మరో మహిళా డాక్టర్‌ను వివాహం చేసుకున్నాడు.దీంతో ప్రియుడు దక్కలేదన్న కక్షతో వసుంధర ఆ డాక్టర్‌ భార్యపై తీవ్ర ద్వేషం పెంచుకుంది.ఈ క్రమంలో ఆమె బాధిత వైద్యురాలికి హెచ్‌ఐవీ సోకేలా ఇంజెక్షన్‌ చేయాలని పథకం రచించిం ది.ఇందుకు కొంగె జ్యోతి (ఆదోని),భూమా జశ్వంత్‌,భూమా శృతి (మంత్రాలయం)ల సహ కారం తీసుకుంది.ప్రభుత్వ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న హెచ్‌ఐవీ బాధితుల నుంచి ఇతర నర్సుల సహాయంతో హెచ్‌ఐవీ వైరస్‌తో కూడిన రక్తాన్ని సేకరించి,దాన్ని ఇంజెక్షన్‌ రూ పంలో బాధిత మహిళా డాక్టర్‌కు ఎక్కించిన ట్లు పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ ఘటన సభ్య సమాజాన్ని తీవ్రంగా కలచివేసిం దని,ఇలాంటి నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....