స్వచ్ఛతలో నగరానికి అగ్రస్థానమే లక్ష్యం... పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్...
స్వచ్ఛతలో నగరానికి అగ్రస్థానమే లక్ష్యం
స్వచ్ఛ నగర సాధనకు ప్రజల సహకారం అవసరం
‘స్వచ్ఛ సర్వేక్షన్’ మార్గదర్శకాల అమలు పై సమీక్ష
పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరాన్ని స్వచ్ఛతలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టడమే ల క్ష్యంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పారిశుద్ధ్య విభాగ సిబ్బందికి సూచించారు.శుక్రవారం కమిష నర్ నివాస కార్యాలయంలో ‘స్వచ్ఛ సర్వే క్షన్’ మార్గదర్శకాల అమలు,కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహిం చారు.ఈ సందర్బంగా కమిషనర్ పి.విశ్వ నాథ్ మాట్లాడుతూ నగర స్వచ్ఛతను మ రింత మెరుగుపరిచే దిశగా అధికారులు, సిబ్బంది మరింత చురుగ్గా పనిచేయాలని సూచించా రు.స్వచ్ఛ సర్వేక్షన్ తాజాగా వి డుదల చేసిన మార్గదర్శకాలు,విధివిధానాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపా రు.ప్రతి వార్డులో ప్రజలను చైతన్య పరిచే ర్యాలీలు,అవగాహన సదస్సులు,ప్రచార కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించా లని ఆదేశించారు.
వాల్ పెయింటింగ్స్,మైక్ అనౌ న్స్మెంట్లు,వార్డుల మధ్య స్వచ్చత పోటీల ద్వారా ప్రజల్లో స్వచ్ఛతపై మరింత అవ గాహన పెంచాలని పేర్కొన్నారు.స్వచ్ఛ నగర సాధన అనేది కేవలం నగరపాలక బాధ్యత మాత్రమే కాదని,ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామిగా మారినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయ న్నారు.ఇంటి నుంచే చెత్తను వేరు చేయ డం,ప్రజా ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం వంటి చిన్న చర్యలే పెద్ద మార్పుకు దారితీ స్తాయన్నారు.అధికారులు,సిబ్బంది ప్రజ లతో సమన్వయంగా పనిచేస్తూ కర్నూలు ను ఆదర్శ స్వచ్ఛ నగరంగా నిలబెడదా మని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ,డి ప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు,ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగప్రసాద్,డిఈఈ పవణ్ రెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ శ్రీనివాసులు, సూపరింటెండెంట్లు నాగరాజు,మంజూర్ బాష,స్వచ్ఛ సర్వేక్షన్ కోఆర్డినేటర్లు శ్రీని వాస్,కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment