ఘనంగా బ్రహ్మశ్రీ రాహు సాహెబ్ పండిత గా నాల రామ్మూర్తి జయంతి వేడుకలు...కమ్మరి పార్వతమ్మ,ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమం,అభి వృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్...
ఘనంగా బ్రహ్మశ్రీ రాహు సాహెబ్ పండిత గానాల రామ్మూర్తి జయంతి వేడుకలుకమ్మరి పార్వతమ్మ,ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమం,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్
బ్రహ్మశ్రీ రాహు సాహెబ్ పండిత గానాల రామ్మూర్తి జయంతి వేడుకలు విజయవాడ మ హానగరంలో గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ నందు ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ని ర్వహించారు.ఈ సందర్బంగా కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ మాట్లాడుతూ విశ్వ బ్రా హ్మణ కులం నుండి మొట్టమొదటి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవి పొంది,ఆ నాటికి బ్రి టిష్ గవర్నమెంట్ ని ఒప్పించి ఓసి వర్గానికి చెందిన మమ్ములను ముందుచూపుతో భవి ష్యత్ తరాలకి రిజర్వేషన్ సంపాదించడం కోసం,బిసి వర్గానికి మార్చటం కోసం అహర్ని శలు కృషిచేసి దేశంలో ఎన్నో కమ్యూనిటీ మీటింగ్ ఏర్పాటు చేసి బీసీల్లో చేర్చిన ఘనత రాహు బహుదూర్ గానాల రామ్మూర్తికి చెందిందని అన్నారు.విశ్వ బ్రాహ్మణులకు పుట్టుక తోనే పేరు ముందు బ్రహ్మశ్రీ అనే అరుదైన పదాన్ని కొంతమంది కావాలనే ఉన్నత వర్గాలు తొలగించిన క్రమంలో ఆ విషయాలను కూడా కోర్టు ద్వారా శాశ్వతంగా విశ్వబ్రాహ్మణు లకు చెందినదే బ్రహ్మశ్రీ అని పోరాడి సాధించిన గొప్ప ఘన చరిత్ర కలిగిన వ్యక్తి అని వా రు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కార్పొరేషన్ డైరెక్టర్ తునికి పార్టీ శివ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షులు బ్రహ్మశ్రీ జవ్వాది కూర్మచార్యులు,విజయవా డ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గోల్తి శ్రీనివాస చక్రవర్తి,ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ,కడారు వెంకటే శ్వర రావు,పాలతీర్థపు శ్రీనివాసచారి,రేసు పురుషోత్తమ చారి,ధనాలకోట వాసు,కనితి శ్రీనివాస్,మేడిది కోటేశ్వ రరావు,బొండాడ వినోద్,తదితర విశ్వ బ్రాహ్మణ సోదరులు పా ల్గొన్నారు.
Comments
Post a Comment