అధిక శబ్దాలు చేసే 100 బైక్ సైలెన్సర్సులు,500 ఆటో హారన్ లు రోడ్ రోలర్తో ధ్వంసం...కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్...
అధిక శబ్దాలు చేసే 100 బైక్ సైలెన్సర్లు,500 ఆటో హారన్ లు రోడ్ రోలర్తో ధ్వంసం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయం కొండారెడ్డి బురుజు వద్ద అధిక శబ్దాలు చేసే 100 బైక్ సైలెన్సర్లు,500 ఆటో హారన్ లను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వ ర్యంలో శనివారం రోడ్ రోలర్తో ధ్వంసం చేయించారు.ఈ సందర్బంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో కొంతమంది యువకులు వారి యొక్క ద్విచక్ర వాహనాలకు అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్స్ ను మాడిఫైడ్ చేసి అమర్చుకుని,అధిక శబ్దం వ చ్చే విధంగా డ్రైవ్ చేయడంతో వారిపై ఒక నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిం చామ న్నారు.డ్రైవ్ లో 100 బైక్ సైలెన్సర్లు,500 ఆటోల హారన్ లను సీజ్ చేయడం జరిగింద న్నారు.కావున వాటిని నేడు రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వంసం చేయడం జరిగిందన్నా రు.రాత్రి వేళల్లో అధిక శబ్దం వచ్చే విధంగా సౌండ్ పోల్యూషన్ చే స్తున్నారని ప్రజల నుం డి ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు.ప్రజలు,యువతకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన చేస్తు న్నామన్నారు.ఎవరైనా మోడిఫై చేసిన సైలెన్సర్లను ద్విచక్రవాహనాలకు,ఆటోలకు హారన్ లు అమర్చినట్లయితే జరిమనాలతో పాటు ఆ వాహానాలను సీజ్ చేస్తామన్నారు.చట్టం ప్ర కారం శబ్ద కాలుష్యం చేస్తూ అధిక శబ్దం చేసే బైక్ సైలెన్సర్లు,ఆటో హారన్లను అమర్చుకో కూడదన్నారు.అధిక శబ్దం వలన ప్రజలకు అసౌకర్యం కలగడమే కాకుండా,వృద్ధులు, చిన్నారు లు,రోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయ న్నారు.మోటార్ వెహికల్స్ చట్టం ప్ర కారం అనుమతి లేని మార్పులు చేసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు.
ప్రతి వాహనదారుడు వ్యక్తిగత భద్రత పాటించాలని,రోడ్డు భద్రత నియమాలను పాటిం చాలని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నా రు.కర్నూలు పట్టణంలో సా మాజిక బాధ్యత కలిగిన పబ్లిక్,ప్రవేట్ సంస్ధల వారు ట్రాఫిక్ పోలీ సులకు సహాకారం అం దిస్తున్నారన్నారు.కార్పో రేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి నిధుల క్రింద ట్రాఫిక్ క్రమబద్దీకరణకు దాతలు సహకారం అందిస్తున్నారన్నారు.డిజిటల్ ఎల్ ఈడి డిస్ ప్లే బోర్డును,66 సోలార్ రెడ్ బ్లింకింగ్ స్టడ్స్ ను,4 అధునాతన మూవబుల్ బారికేడ్స్ ను కర్నూలు ట్రాఫిక్ పోలీసు లకు దాతలు అందజేశారన్నారు.అనంతరం దాతలైన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం,గో ల్డ్ షాప్ ప్రభాకర్,డిఈ ఫణీ కుమార్ లకు కర్నూలు ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు.ముఖ్య మైన రద్దీ ప్రాంతాలలో రాత్రి వేళల్లో రోడ్డు బాగా కనిపించే విధంగా సోలార్ రెడ్ బ్లింకింగ్ స్టడ్స్ ను త్వరలో ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా,కృష్ణ మోహన్,కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్,స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసుధన్ రావు,కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, ఆర్ ఐలు,ఆర్ఎస్ఐలు,కర్నూలు ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
Comments
Post a Comment