శ్రీశైలం మలన్న హుండీ లెక్కింపు...13 రోజుల్లో కోట్లల్లో...భక్తుల కానుకలు...
శ్రీశైలం మలన్న హుండీ లెక్కింపు...
13 రోజుల్లో కోట్లల్లో...భక్తుల కానుకలు
నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి చెంత భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.ఇటీవల అత్యంత వైభవంగా జరిగిన మహాశివరాత్రి బ్ర హ్మోత్సవాల సందర్భంగా భక్తులు పోటెత్తారు.ఈ సందర్భంగా స్వామి,అమ్మవార్లకు సమ ర్పించిన కానుకల లెక్కింపును దేవస్థానం అధికారులు పూర్తి చేశారు.గత 13రోజుల కు గాను మల్లన్నకు భారీగా ఆదాయం లభించింది.చంద్రవతి కళ్యాణ మండ పంలో కట్టుదిట్ట మైన భద్రత,సీసీ కెమెరాల నిఘా మధ్య జరిగిన ఈ లెక్కింపులో స్వామి వారికి రూ. 5,6 1,81,535 నగదు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు,ఈఓ శ్రీనివా సరావు అధికారికంగా ప్రకటించారు.నగదుతో పాటు భక్తులు మొక్కుల రూపంలో పెద్ద ఎ త్తున బంగారు,వెండి ఆభరణాలను సమర్పించారు.స్వామి అమ్మవార్లకు కానుకగా 124.5 గ్రాముల బంగారం,5.550కేజీల వెండి సమకూరాయి.భారతీయ కరెన్సీతో పాటు విదే శాల్లోని భక్తులు కూడా స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు.హుండీలో 22 అమెరి కా డాలర్లు,25 ఇంగ్లాండ్ పౌండ్లు,15 ఆస్ట్రేలియా డాలర్లు,సింగపూర్ డాలర్లు,యూరో లతో పాటు యూఏఈ దిర్హమ్స్,ఒమన్ బైసా,మలేషియా రింగిట్స్ వంటి వివిధ దేశాల క రెన్సీలు లభించాయి.
Comments
Post a Comment