ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ...ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్కు బ్రిటిష్ పౌరుడు...
ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణఇంగ్లండ్ నుంచి హైదరాబాద్కు బ్రిటిష్ పౌరుడు19 ఏళ్ల పాటు సాగిన అన్వేషణ ఎట్టకేలకు సఫలం130 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లో మరణించిన బ్రిటిష్ సైనికుడుజర్నలిస్ట్ సహాయంతో తిరుమలగిరి శ్మశాన వాటికలో సమాధి గుర్తింపుపూర్వీకుడి సమాధి వద్ద కన్నీటి నివాళులర్పించిన ముని మనవడు
ప్రేమ,అనుబంధాలకు సరిహద్దులు ఉండవన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన.ఏకంగా 130 ఏళ్ల క్రితం హైదరాబాద్లో కన్నుమూసిన తన ముత్తాత సమా ధిని వెతుక్కుంటూ ఓ వ్యక్తి ఇంగ్లండ్ నుంచి నగరానికి వచ్చారు.19 సంవత్సరాల పాటు సాగించిన అన్వేషణ ఫలించడంతో,తన పూర్వీకుడి సమాధి వద్ద భావోద్వేగంతో నివాళు లర్పించారు.వివరాలు ఇలా ఉన్నాయి...ఇంగ్లండ్కు చెందిన రాబిన్ డిక్సన్ తన ఇంట్లోని పాత దస్త్రాల ద్వారా,తన ముత్తాత (తాతకు తండ్రి) చార్లెస్ విల్సన్ బ్రిటిష్ ఇండియాలో మరణించారని తెలుసుకున్నారు.చార్లెస్ విల్సన్ 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరి బెంగ ళూరు,మద్రాసులలో పనిచేశారు.ఆ తర్వాత సికింద్రాబాద్ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా పని చేస్తున్న సమయంలో,1906,ఆగస్టు,4న అనారోగ్యంతో తిరుమలగిరి ఆసుపత్రిలో మర ణించారు.అప్పట్లో ఆయన వయసు 48 సంవత్సరాలు.అప్పటి నుంచి తన ముత్తాత స మాధి ఎక్కడ ఉందో తెలుసుకోవాలని రాబిన్ డిక్సన్ గట్టిగా సంకల్పించుకున్నారు. దా దాపు 19 ఏళ్ల పాటు బెంగళూరు,చెన్నై, సికింద్రాబాద్లలో గాలించారు.ఈ క్రమంలో స్థా నిక పాత్రికేయుడు రవిరెడ్డి సహాయంతో,ఎనిమిది నెలల క్రితం సికిం ద్రాబాద్లోని తిరు మలగిరి 'సెమెట్రీ-12'లో చార్లెస్ విల్సన్ సమాధిని గుర్తించారు.ఈ విషయం తెలియగా నే రాబిన్ తన భార్య లిన్తో కలిసి ఇంగ్లండ్ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్కు వచ్చారు. ముత్తాత సమాధిపై తెల్ల గులాబీలు ఉంచి కన్నీటి పర్యంతమయ్యారు."ఈ క్షణం కోసమే ఇన్నేళ్లుగా ఎదురుచూశాను" అని రాబిన్ తీవ్ర భావోద్వేగంతో అన్నారు.ఒక శతాబ్దానికి పై గా సాగిన ఈ అనుబంధం,రాబిన్ అన్వేషణతో పూర్తయింది.
Comments
Post a Comment