గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్...అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థులు...
గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థులు
మెదక్ జిల్లా,రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూ ర్బా గాంధీ బాలికల పాఠశాలలో భోజన తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 25 మం ది విద్యార్థులు,ముగ్గురు టీచర్లు వాంతులు, విరే చనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు.ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచా రణ చేపట్టారు.వివరాలు ఇలా ఉన్నాయి...క స్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులు తిన్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్పస్థతకు గురయ్యారు.ఈ ఘటన మెదక్ జిల్లా,రేగోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. రోజులాగే రాత్రి పూట భోజనం చేసిన విద్యార్థి నిలు తెల్లవారు జామున నుండి వరుసగా వాం తులు,విరేచనాలు చేసుకోవడాన్ని పాఠశాల సిబ్బంది గుర్తించారు.వీరితోపాటు ఎస్ఎస్సీ ఇంటర్నల్ మార్క్స్ వెరిఫికేషన్ టీంలో నలుగురు ఉపాధ్యాయులు ఈ అస్వస్థత బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన హాస్టల్ వార్డెన్,ఉపాధ్యా యులు విద్యార్థినులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు.వీరిలో పది మంది విద్యార్థినిలకు చికిత్స అందించగా ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలి పారు.ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థి నిలు వాంతులు చేసుకున్నారని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని విద్యార్థినులను విచారించారు.తమకు ఎలాంటి భయాలు వద్దని,పాఠశాల ప్రిన్సిపాల్ విద్యా ర్థినిలకు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించా రు.అస్పస్థతకు గురైన విద్యార్థులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి కస్తూర్బా గాంధీ పాఠశాల కు తరలించారు.పాఠశాలలోనే హెల్త్ క్యాంప్ ఏర్పాటుచేసి చికిత్స అందిస్తామన్నారు.విద్యార్థి నీల తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రిన్సిపాల్ అన్నారు.కానీ తల్లితండ్రు లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కళాశాల ప ట్ల ప్రిన్సిపాల్ నిర్లక్షమే ఈ ఘటనకు కారణం అని చెపుతున్నారు.ఘటనకు సంబంధించి తమ పిల్ల లు ప్రాణాలు కోల్పోతే...బాధ్యత ఎవరు వహిస్తా రు.తెలంగాణ ప్రభుత్వమా? స్వార్థ పూరితంగా, తమ అక్రమ సంపాదన కోసం విధులు నిర్వహిం చిన వార్డెన్,సిబ్బంది వహిస్తారా? అని సూ టిగా ప్రశ్నిస్తున్నారు.
Comments
Post a Comment