ప్రేమ పేరుతో నయవంచన...ఆత్మహత్యకు పాల్పడిన యువతి...
ప్రేమ పేరుతో నయవంచన
ఆత్మహత్యకు పాల్పడిన యువతి
ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.ఫోటోలతో బ్లాక్ మెయిల్కు దిగాడు.చివరకు ఆ యువతి ప్రాణం పోయేలా చేశాడు.గుంటూరు జిల్లాలో ఈ దారు ణ ఘటన జరిగింది.తల్లిదండ్రులు ధైర్యం చెప్పి నా,ఆ కిరాతకుడి బెదిరింపులకు భయపడి యువతి ఫ్యాన్కు ఉరేసుకుని తనువు చాలిం చిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.వివరాలు ఇలాఉన్నాయి...
గుంటూరు జిల్లా,తాడేపల్లి మండలం, పోలకం పాడులో శ్రీనివాసరెడ్డి,రమణమ్మ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అమ్మాయి మీనాక్షి డిగ్రీ చదువుతుంది.అబ్బా యి ఇంటర్ చదువుతున్నాడు. శ్రీనివాసరెడ్డి ముఠా పనులకు వెల్తుండగా,రమణమ్మ హోటల్స్లో కూలీ పనులు చేస్తుంది.మీనాక్షి చదివే కాలేజ్లోనే రహీం చదువతుండగా.. అతడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.గత కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఫోటోలు తీసుకున్నారు.అయితే రహీం ప్రవర్తన నచ్చక పోవడంతో మీనాక్షీ అతనికి దూరంగా ఉంటుం ది.మీనాక్షి తనతో మాట్లాడకపోవఠంతో రహీం కక్ష పెంచుకున్నాడు.మీనాక్షి ఫోన్కి మెస్సెజ్లు పంపుతూ బెదిరిస్తున్నాడు.ఇద్దరి ఫోటోలను ఆమె తల్లిదండ్రులకు పంపుతానని ఈ నేపథ్యం లో తనతో పాటు రూమ్కి రావాలని లేదంటే మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ రహీం బెదిరింపులకు దిగాడు. మొదట పెద్దగా పట్టించుకోని మీనాక్షి రహీం బెది రింపులు పెరిగిపోవడంతో మనోవేదనకు గురైం ది.కూతురి ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమ నించిన తల్లిదండ్రులు నిలదీశారు.దీంతో రహీం తో తన పరిచయం దగ్గర నుండి మొత్తం జరిగిన దంతా చెప్పింది.విషయం తెలుసుకున్న తల్లి దండ్రులు కూతుర్ని ఓదార్చారు.అతని బెదిరిం పులకు భయపడవద్దని చెప్పారు.అయితే ఆ తర్వాత కూడా రహీం బెదిరింపులు ఆగలేదు.ఈ క్రమంలో తల్లిదండ్రులు పనులకు,తమ్ముడు కాలే జ్కు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఫ్యాన్కు ఉరేసు కుంది.సాయంత్రం తల్లి రమణమ్మ పనులు ముగించుకుని ఇంటికొచ్చేసరికి మీనాక్షి ఫ్యాన్కు వ్రేలాడుతూ కనిపించింది.దీంతో లబోదిబోమని తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది.స్థానికుల సమా చారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేపట్టారు.
Comments
Post a Comment