పాత్రికేయుడు ఎస్.జేమ్స్ అకాలమరణం బాధాక రం...పార్థివ దేహానికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజె ఎఫ్)ఘన నివాళులు...
పాత్రికేయుడు ఎస్.జేమ్స్ అకాలమరణం బాధాకరంపార్థివ దేహానికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం(యుజెఎఫ్)ఘన నివాళులు
నిత్యభాను,స్వచ్ఛ ప్రభ ఎడిటర్ ఎస్.జేమ్స్ (45) అనారోగ్యంతో నగరంలోని అమీలియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం మృతి చెందిన ఘటన జరిగింది.ఘటన స మాచారం తెలుసుకున్న యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)బృందం ఆధ్వర్యంలో వ్య వస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు గిలిగిత్త విజయ్ కుమార్ ఆ ధ్వర్యంలోజేమ్స్ స్వగృహంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించా రు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా,ఆత్మకూరు నియోజక వర్గంకు చెందిన ఎస్.సంజీవ రాజు,సరోజమ్మ దంపతులకు కుమారుడిగా ఎస్.జేమ్స్ ఫోటో,వీడి యో కెమెరామెన్ గా విధులు నిర్వహిస్తూనే నిత్యభాను,స్వచ్ఛప్రభ వంటి దినపత్రికలు స్థా పించాడు.
దీంతో ఎంతో మంది యువతను జర్నలిస్ట్ లుగా తీర్చిదిద్దినట్లుగా చెప్పారు.అలాగే యునై టెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజె ఎఫ్) పిలుపు మేరకు జేమ్స్ ప్రతి కార్యక్రమాన్ని విజయవం తం చేయడంలో ప్రధాన పాత్ర పోషించేవాడని అన్నారు.కల్లూరు మండలంలోని ప్రధాన సమస్య జర్నలిస్ట్ ల పిల్లలకు విద్యారాయితీ కోసం నిరంతరం కృషి చేసినట్లు పేర్కొన్నా రు.అదేవిదంగా జర్నలిస్ట్ ల ఇళ్ల సమస్యపై ప్రతి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి,ఇళ్ల స్థ లాల సమస్య పట్ల చిత్తశుద్ధితో పని చేశాడని కొనియాడారు.అంతలోనే కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొని అకాల మరణం పొందడం కర్నూలు జర్నలిస్ట్ లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన చెందారు.ఎస్.జేమ్స్ ఆశయాల సాధనకు యునై టెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు.ఎస్.జే మ్స్ కు భార్య జ్యోతి,కుమారుడు మను విశ్వాస్ రాజ్,కుమార్తె అక్షయలు ఉన్నారు.ఈ కా ర్యక్రమంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) జిల్లా కమిటీ నాయకులు వరప్రసా ద్,మెట్రో మధు,వి.విజయ్ కుమార్,సంధ్యాప్రసాద్,వై.వెంకటేశ్వర రెడ్డి,మధుసూదన్,మల్లి కార్జున,లక్ష్మి నారాయణ,కల్లూరు మండలం జర్నలిస్ట్ లు పురుషోత్తం,తదితరులు పాల్గొ న్నారు.
Comments
Post a Comment