ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత... ఎస్పీ ఆదేశాలతో భద్రతను పర్యవేక్షించిన పోలీసు అధికారులు...
ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతఎస్పీ ఆదేశాలతో భద్రతను పర్యవేక్షించిన పోలీసు అధికారులు
కర్నూలు జిల్లావ్యాప్తంగా సోమవారం నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీ క్షలను ప్రశాంతంగా,సజావుగా నిర్వహించేందుకు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.ఎస్పీ ఆదేశాల మేరకు జి ల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏ ర్పాటు చేశారు.పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాలను ఆకస్మి కంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాల పనితీరును పర్యవేక్షి స్తూ నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.ట్రాఫిక్ అంతరాయం లేకుండా,పరీక్షలు నిర్వ హించే ప్రాంగ ణాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా,కాపీ యింగ్ కు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
Comments
Post a Comment