చిన్నారులపై దారుణ లైంగిక వేధింపులకు పాల్ప డిన కామ పిశాచాలకు ఉత్తరప్రదేశ్లోని బాండా ప్రత్యేక పోస్కో కోర్టు మరణ శిక్ష...
చిన్నారులపై దారుణ లైంగిక వేధింపులకు పాల్పడిన కామ పిశాచాలకు ఉత్తరప్రదేశ్లోనిబాండా ప్రత్యేక పోస్కో కోర్టు మరణ శిక్ష
చిన్నారులపై దారుణ లైంగిక వేధింపులకు పాల్పడిన కామ పిశాచాలకు ఉత్తరప్రదేశ్లోని బాండా ప్రత్యేక పోస్కో కోర్టు మరణ శిక్ష విధించింది.నిందితులైన నీటిపారుదల శాఖ మాజీ జూనియర్ ఇంజనీర్ రామ్ భవన్,అతని భార్య దుర్గా వతికి మరణశిక్ష విధిస్తూ చా రిత్రాత్మక తీర్పు నిచ్చింది.2010 నుండి 2020 మధ్య కాలంలో దాదాపు 33 మంది మైన ర్ బాలురపై 3ఏళ్ల చిన్నారులతో సహా దారుణమైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కో ర్టు నిర్ధారించింది.2లక్షలకుపైగా అభ్యంతరకర వీడియోలు,ఫొటోలను దాదాపు 47 దేశా లకు ఇంటర్నెట్ ద్వారా చేరవేశారు.ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించిన న్యా యమూర్తి ప్రదీప్ కుమార్ మిశ్రా,నిందితుల క్రూరత్వం సమాజ నైతిక పునా దులనే కదిలిం చిందని పేర్కొన్నారు.బాధితులైన 33మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహా రం చెల్లించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.నిందితుల ఇంట్లో స్వాధీనం చే సుకున్న నగదును కూడా బాధితులకు సమానంగా పంపిణీ చేయాలని సూచించింది.ఈ కే సును 2020లో సిబిఐ నమోదు చేసి విచారణ చేపట్టింది.నిందితులు తమ నేరాల కో సం చిత్ర కూట్ ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని ఈ దారుణాలకు పాల్పడినట్లు తేలింది.
Comments
Post a Comment