బాధ్యతతో సురక్షితమైన ప్రయాణం సాగించాలి... నవిత,ఎస్సై మధిర...
బాధ్యతతో సురక్షితమైన ప్రయాణం సాగించాలి నవిత,ఎస్సై మధిర
ప్రతి ఒక్కరూ బాధ్యతతో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం సాగిం చాలని మధిర ఎస్సై నవిత అన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న రెండోవ విడత అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని వైరా ఏసీపీ సారంగపాణి పర్యవేక్షణలో సోమవారం మధిర పట్టణంలోని వాహనదారులకు అవగాహన కల్పించా రు.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ...అతివేగం...మద్యం మత్తు...ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని,దీంతో రహదారులు నెత్తురో డుతుండగా విలువైన ప్రాణాలు కోల్పోయి,బాధిత కుటుంబాల్లో విషాదం అలుముకుం టోందని అన్నారు.రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ జిల్లాలో ప్రమాదా ల నివారణపై దృష్టి సారించిందని,కాబట్టి వాణిజ్య,వర్తక వ్యాపారులు తమ వద్ద పనిచేస్తు న్న వారికి కూడ తమవంతు భాద్యతగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు.
Comments
Post a Comment