సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు...117 మంది అరెస్ట్....

సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు...117 మంది అరెస్ట్
VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.విదేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్న క్రిమినల్స్ కు మ్యూల్ అకౌంట్లు సమకూరుస్తున్న వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు.ఫిబ్రవరిలో ఆపరేషన్ ఆక్టోపస్ పేర వేర్వేరు రాష్ట్రాల్లో దాడులు జరిపిన ప్రత్యేక బృందాలు 117 మంది నిందితులను అరె స్ట్ చేశారు.వీటిలో అత్యధికంగా ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ నేరాలు 63 ఉన్నాయి.ఆ తరువాత 6 డిజి టల్ అరెస్టులు, 4ఓటీపీ ఫ్రాడ్, ఒక సోషల్ మీడి యా మోసం కేసులు ఉన్నాయి.ఇక,గత నెలలో రూ. 34.76లక్షలను బాధితులకు రీఫండ్ చేశా రు.

1081కేసుల్లో :

ఆపరేషన్ ఆక్టోపస్ లో భాగంగా 16 రాష్ట్రాల్లో అరెస్ట్ చేసిన 117మంది నిందితులకు దేశ వ్యా ప్తంగా 1,081 కేసులతో సంబంధం ఉన్నట్టుగా వెల్లడైందని అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఎం.శ్రీనివాస్ తెలిపారు.వీరి ఖాతాల్లో నుంచి రూ.139 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా నిర్దా రణ అయ్యిందన్నారు.ఇక,నిందితుల నుంచి రూ 36లక్షలు నగదు, 221 మొబైల్ ఫోన్లు,26ల్యాప్ టాప్ లు,115 చెక్ బుక్కులు,141 సిమ్ కార్డులు, 54 డెబిట్ కార్డులు,56 షెల్ కంపెనీల స్టాంపులు, ఒక క్యాష్ కౌంటింగ్ మిషన్,152 పాస్ బుక్కులు, 5 ట్రేడ్ లైసెన్సులు,ఆరు ఆడిట్ నివేదికలు, 3 లెడ్జ ర్లను సీజ్ చేసినట్టు వివరించారు.

జోనల్ సైబర్ సెల్స్ :

జోనల్ సైబర్ సెల్స్ కు గత నెలలో 2,963 పిటి షన్లు వచ్చాయి.వీటిలో 461 పిటిషన్లపై అధికా రులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.ఈ కేసుల్లో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 11మందిని అరెస్ట్ చేశారు.బాధితులకు 24.10 లక్షలను రీఫండ్ చేశారు.

సైబర్ పెట్రోలింగ్ :

సైబర్ పెట్రోలింగ్ ను నిరంతరం జరుపుతూ ఇం టెలిజెన్స్ ట్రాకింగ్ ద్వారా ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ లను సోషల్ మీడియాలో ప్రోత్సహిస్తున్న124 ఫేస్ బుక్,ఇన్ స్టాగ్రాం ప్రొఫైళ్లను సైబర్ పోలీసులు గుర్తించారు. 539 పెయిడ్ అడ్వర్టయిజ్ మెంట్లను నడుపుతూ యువతను బెట్టింగ్,గేమింగ్ వైపు ఆకర్షితులను చేస్తున్నారు. ఈ క్రమంలో 124 ప్రొఫైళ్లను సోషల్ మీడియా ప్లాట్ ఫాంల నుంచి తొలగించారు.

సీ మిత్ర :

సీ మిత్ర ద్వారా గత నెలలో సైబర్ మోసాలకు గురైన 2,396మంది బాధితులకు ఫిర్యాదులు నమోదు చేయటంలో మార్గదర్శకత్వం అందిం చారు.ఈ క్రమంలో వచ్చిన కంప్లయింట్ల ఆధా రంగా 257 జీరో ఎఫ్ఐఆర్ లను జారీ చేశారు. సైబర్ మోసానికి గురైతే బాధితులు వెంటనే 19 30 నెంబర్ కు ఫోన్ చేయాలని అదనపు కమి షనర్ శ్రీనివాసులు సూచించారు.దాంతో పాటు www.cybercrime.gov.in లో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...