ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు...33ఏళ్ల పాటు రెండు శాఖల నుండి జీతం...
ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు
33ఏళ్ల పాటు రెండు శాఖల నుండి జీతం
ఉత్తరప్రదేశ్లో నకిలీ పత్రాల సాయంతో ఒకే సమ యంలో రెండు వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఉద్యో గం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.సదరు వ్యక్తి సుమారు 33 ఏళ్ల పాటు రెండు చోట్ల నుండి జీతం మరియు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను పొందుతూ వచ్చాడు.అయితే, సమాచార హ క్కు చట్టం (RTI) ద్వారా ఈ మోసం బయటప డింది.దీనిపై విచారణ జరిపిన కోర్టు,నిందితుడి ని దోషిగా నిర్ధారిస్తూ ఏడేళ్ల జైలు శిక్ష విధించిం ది.దీనితో పాటు రూ. 30 వేల జరిమానా కూడా విధించింది.ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... 20 09,ఫిబ్రవరి,20న బారాబంకికి చెందిన ప్రభాత్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్రీఖ్ ప్రాంతానికి చెందిన జయప్రకాష్ సింగ్ అనే వ్యక్తి నకిలీ పత్రాలను సృష్టించి,మోసపూరి తం గా రెండు వేర్వేరు చోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం పాటు రెండు శాఖల నుండి జీతం
విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి.జయప్రకాష్ సింగ్ 1993, జూన్ లో బారాబంకి జిల్లాలోని ప్రాథమిక విద్యా శాఖలో ఉపాధ్యాయుడిగా నియమితుడ య్యారు.అయితే,ఉపాధ్యాయుడు కాకముం దే...1979, డిసెంబర్ 26న ప్రతాప్గఢ్ జిల్లాలో 'నాన్ మెడికల్ అసిస్టెంట్'గా ఆయన బాధ్యతలు చేపట్టారు.ఆయన ఈ రెండు పదవుల్లోనూ ఒకే సారి కొనసాగుతూ,దశాబ్దాల పాటు రెండు శా ఖల నుండి జీతభత్యాలు పొందినట్లు తేలింది. ఏడేళ్ల శిక్ష మరియు రూ. 30 వేల జరిమానా
పోలీసుల దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలైంది.విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలను,సాక్షులను ప్రవేశపెట్టింది.వా దోపవాదాలు విన్న తర్వాత,ప్రధాన జ్యుడీషియ ల్ మేజిస్ట్రేట్ సుధా సింగ్ నిందితుడు జయప్ర కాష్ సింగ్ను దోషిగా తేల్చారు.అతనికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 30 వేల జరి మానా విధిస్తూ తీర్పునిచ్చారు.
Comments
Post a Comment