ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం ప్రారంభం... గోళ్ళ రాజేష్,నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త...
ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం ప్రారంభం
గోళ్ళ రాజేష్,నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త,సామాజికవేత్త
నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సంఘమిత్ర బాలుర గృహం పక్కన సలీం నగర్ వెల్లే దారిలో నాలుగు నెలలుగా ఒక్క రూపాయికే ప్లేట్ పుల్కా,కర్రీ, పప్పు,ఒక్క రూపాయికే కలర్ రైస్,కర్రీ,రూపా యికే జొన్న రొట్టె,పప్పు నిరంతరాయంగా కొనసా గుతా ఉన్న నేపథ్యంలో శుక్రవారం నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త,సామాజికవేత్త గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో వినూత్నంగా కేవలం ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం ప్రారంభించా రు.ఎంతో మంది ప్రజలు నంద్యాల జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలకు తమపని కొరకు ఎంతోమంది వస్తూ ఉంటారు అలాంటి సమయంలో వారందరికీ కమ్మని రుచికరమైన భోజనం అతి తక్కువ ధరలో అందించాలని అటువంటి సదుద్దేశంతో ఇప్పటికే పుల్కాలు,క లర్ రైస్ జొన్న రొట్టెలు అందిస్తున్న విషయం నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే నేటి నుండి కేవలం ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం అందించాలని సంక ల్పంతో ఒక్క రూపాయికే భోజనం ప్రారంభిం చారు.ఈ విషయాన్ని నంద్యాల నియోజకవర్గం లో తెలియజేయడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము.ఈ కార్యక్రమాలన్ని సజావుగా ముందుకు వెళ్లడానికి నంద్యాల నియోజకవర్గ పెద్దలు,మా శ్రేయోభిలాషులు,స్నేహితులు,ప్రజ లు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా వారు ధన్యవాదాలు తెలియజేశారు.
Comments
Post a Comment