వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు...కేసు నమోదు చేసిన చిన్నకోడూరు పోలీసులు...
వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు
కేసు నమోదు చేసిన చిన్నకోడూరు పోలీసులు
ఆస్తి రాసిచ్చిన తర్వాత కన్నతండ్రిని,తల్లిని పట్టించుకోకుండా,కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్న ఇద్దరు కొడుకులపై చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... గంగాపూర్ గ్రామానికి చెందిన కొండి నారాయణ రెడ్డి (94) కు ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమా ర్తెలు కలరు.పెద్ద కుమారుడు రాజిరెడ్డి సిద్దిపే టలో వ్యాపారం చేస్తుండగా,చిన్న కుమారుడు పరమేశ్వర్ రెడ్డి గంగాపూర్లోనే వ్యవసాయం చేస్తున్నాడు.నారాయణరెడ్డి తనకున్న ఏడు ఎకరాల భూమిని ఇద్దరు కొడుకులకు సమా నంగా (చెరి 3 ½ ఎకరాలు) రిజిస్ట్రేషన్ చేసి ఇ చ్చారు.వయస్సు పైబడటంతో తమను చూసు కుంటారని ఆస్తిని అప్పగించగా,కొడుకులు మాట మార్చారు.తమను ఒక పాత ఇంట్లో ఉం చి,కనీస సౌకర్యాలు కల్పించకుండా,సరిగ్గా తిం డి కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తు న్నారని నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుతిరిగి ప్రశ్నిస్తే బూతు మాటలతో తిడు తూ,చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను,చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ మానవత్వంతో స్పందించారు.బా ధితుడు పోలీస్ స్టేషన్కు రాలేని స్థితిలో ఉన్నం దున,అధికారులే నేరుగా నారాయణరెడ్డి నివా సానికి వెళ్లి ఆయన ఫిర్యాదును స్వీకరించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులను వేధించడం చట్టరీత్యా నేరమని, బాధ్యులైన ఇద్దరు కొడుకు లపై కేసు నమోదు చేయడం జరిగిందని,చట్టరీ త్య తగిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీను ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Post a Comment