ప్రజలతో మమేకమవ్వడానికే ఇఫ్తార్ విందు... అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా...
ప్రజలతో మమేకమవ్వడానికే ఇఫ్తార్ విందు
అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా
ప్రజలతో మమేకమై పోలీసు–ప్రజల మధ్య స త్సంబంధాలను మరింత బలోపేతం చేయ డాని కే ట్రాఫిక్ పోలీసులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తెలిపారు.గురువారం కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సీఐ మన్సూ రుద్దీన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు.కార్యక్ర మా నికి అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా హాజరయ్యారు. ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మా ట్లాడుతూ పోలీసులు,ప్రజలకు మధ్య అవగాహన పెంపొందడం ఎంతో అవసరమన్నారు.ఇఫ్తార్ విందు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ సమస్యల పట్ల అవగాహన కల్పించడం అభినందనీయమని అ న్నారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని,దాంతో వారి కుటుంబాలు కూడా తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితి మారా లంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.ట్రాఫిక్ పోలీసుల సేవలను ఆయన అభినందించారు.
సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మె ట్ ధరించాలి,నాలుగు చక్రాల వాహనాలు నడిపేవా రు సీ టు బెల్ట్ ధరించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రమేష్, ఎఎస్ఐ వేణుగోపాల్,ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment