ట్రాఫిక్ నిబంధనలు...రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్ లకు అవగాహన...ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్...
ట్రాఫిక్ నిబంధనలు...రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్ లకు అవగాహన
ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, కర్నూల్ డీఎస్పీ జె.బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధ నలు,రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా
ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ...ఆటో డ్రైవర్లు మ ద్యం సేవించి వాహనాలు నడపకూడదని,ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూ చించారు.ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. వేగంగా వాహనం నడపడం,డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటి చర్యలను నివారించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరారు.అనంతరం రోడ్డు ప్రమా దాలకు సంబంధించిన అవగాహన వీడియో లను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ప్రొజెక్టర్ ద్వారా ఆటో డ్రైవర్లకు చూపించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది,ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Post a Comment