ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలి...వామపక్ష పార్టీలు,ప్రజా సంఘాల డిమాండ్...
ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్ష ణమే నిలిపివేయాలి
వామపక్ష పార్టీలు,ప్రజా సంఘాల డిమాండ్
అమెరికా,ఇజ్రాయేల్ దేశాలు ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ వామపక్ష పార్టీలు,ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయం నుండి భారీ ర్యాలీ కలెక్టరేట్ కార్యాలయం వరకు జరిగింది. ఈ సందర్బంగా కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమానికి సిపియం పార్టీ న్యూసిటి కార్యదర్శి టి.రాముడు,సిపిఐ నగరపార్టీ కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.కార్యక్రమా నికి హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ కే.రామాంజనేయులు,సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్,ఎయూసిఐ జిల్లా నాయ కులు హరీ ష్,పిఓపి జిల్లా నాయకులు శ్రీనివాసరావు సిపి యం నగరకార్యదర్శి యం.రాజశేఖర్ లు మాట్లా డుతూ అమెరికా,ఇజ్రాయేల్ దేశాలు ఇరాన్ పై చేస్తు న్న యుద్ధం అమానుషమని,వందలాది అమాయకపు పసిపిల్లల ప్రాణాలను,ప్రజల ప్రాణాలను హరించి వే స్తున్నారని విమర్శించారు.అమెరికా,ఇజ్రాయేల్ దేశా లు ప్రపంచ మానవాళి శత్రువులని,వారి సొంత సా మ్రాజ్యవాద,వ్యాపార ప్రయోజనాల కొరకే యుద్ధా లను చేస్తున్నారని విమర్శించారు.ఇవ్వాళ ప్రపంచ మొత్తం సం క్షోభంలో పడిపోయిందని,తక్షణమే యుద్ధాన్ని నిలిపివేయాలని,ఇరాన్ లో సంరక్షణ చ ర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఇదే సందర్భంగా ఇరాన్ యుద్ధం పట్ల భారత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు వైఖరిని ఖండించారు.గ్యాస్ సిలిండర్ ధర లు పెరిగిపోతూ వున్నా,ఈ దేశ ప్రజలు ఇబ్బందు లను ఎదుర్కొంటూ వున్నా,మోడీ ప్రభుత్వం నిర్ల క్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా నిరసించారు. యుద్ధం నిలిపి వేయాలని,శాంతి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
రైతు సంఘం రాష్ట్ర నాయకులు జగన్నాథం,సిఐటీ యు నాయుకులు పియుస్.రా ధాకృష్ణ,విజయ్, నరసింహులు,నగేష్,అబ్దుల్ దేశా య్,ఐద్వా జిల్లా నాయకురాళ్ళు,అలివేలు,శ్యామల,పద్మ,కుమారి, కెవిపిఎస్ జిల్లానాయకులు అనంద్ బాబు,బాస్కర్,డి వైఎఫ్ ఐ కార్యదర్శి అబ్దుల్లా,హుశే న్ బాషా,రజకసం ఘం జిల్లానాయకులు గురుశేఖర్,శేషాద్రీ,శ్రీనివాసు లు,ఎల్లయ్య,ఎస్ యుసియు జిల్లా నాయకులు నాగ న్న,పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు,పుల్లారె డ్డి,రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు రత్నం ఏసేపు,విజయభాస్కర్ రెడ్డి, రైతు కూలీ సం ఘం నాయకులు సుంకన్న సిపిఎం,సి పిఐ నగర నా యకులు,సాయిబాబా,సుదాకరప్ప,రామక్రీష్ణ,మహ్మ ద్ రఫీ,యేసు,మదు,మహేష్,శ్రీ నివాస రావు,మీస న్న,మల్లన్న,భారతి,శ్రీనివాసులు,నాగరాజు,తదితరు లు పాల్గొన్నారు.
Comments
Post a Comment