విశ్రాంత జాయింట్ కలెక్టర్ రామస్వామి మృతికి సిపిఎం సంతాపం...
విశ్రాంత జాయింట్ కలెక్టర్ రామస్వామి మృతికి సిపిఎం సంతాపం
విశ్రాంత జాయింట్ కలెక్టర్ రామస్వామి బుధ వారం కర్నూలులోని బాలాజీ విలాస్ లో తన స్వగృహంలో బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సిపిఎం జిల్లా ప్రతి నిధి బృందం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రాజశే ఖర్ గురుశేఖర్ నగేష్ లు ఆయన స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక గాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.వారి కుటుంబ సభ్యు లను పరిమర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రామస్వామి కర్నూలు జిల్లాలో ఒక మంచి అధి కారిగా వివిధ హోదాల్లో పని చేశాడని,అలాంటి వ్యక్తి మృతి చెందడం బాధాకరమని తెలిపారు. ఆయన మృతికి సిపిఎం పార్టీ సంతాపాన్ని తెలి యజేస్తుందన్నట్లు చెప్పారు.మృదుస్వభావిగా ఎవరు ఏ సమస్య తీసుకెళ్లిన పరిష్కారానికి ప్ర యత్నం చేసే అధికారిగా ఈ జిల్లాలో పనిచేశాడ ని,రామస్వామి ఉద్యోగరీత్యా కర్నూలు జిల్లా లో ని ఎక్కువ కాలం పని చేశారు.డి ఆర్ ఓగా,జా యింట్ కలెక్టర్ -2,జాయింట్ కలెక్టర్ గా,శ్రీశై లం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ గా వివిధ హోదాల్లో పని చే శారాయన.కొంతకాలం శ్రీకాళహస్తి లో ఈఓగా ప ని చేశారు.ఎక్కడ ఉన్నా ఆయన అందరిని ఆ ప్యాయంగా ప్రేమగా పలకరించే అధికారి.నేటి ఉ ద్యోగులకు రామస్వామి ఆదర్శంగా నిలుస్తారని వారు పేర్కొన్నారు.
Comments
Post a Comment