మట్టిలో మాణిక్యాలు...ప్రభుత్వ పాఠశాల విద్యార్థు ల విజయదుందుభి...10లో ప్రతిభ చాటిన విద్యార్థు లకు అభినందనలు...దాసరి మోహన్,శ్రీశ్రీశ్రీ అభయాం జనేయ స్వామి ఆలయం అధ్యక్షులు...
మట్టిలో మాణిక్యాలు...ప్రభుత్వ పాఠశాల వి ద్యార్థుల విజయదుందుభి
10లో ప్రతిభ చాటిన విద్యార్థులకు అభినందన లు
దాసరి మోహన్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం అధ్యక్షులు
నేటి సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి తమ పిల్లలను ప్రైవేట్,కార్పోరేట్ పాఠశాలల్లో చదివిస్తూ ఆర్థికంగా ఇ బ్బందులు ఎదుర్కొంటున్న తల్లి,తండ్రులు అనేకం.అ లాంటి వారికి కనువిప్పు కలిగించేలా ప్రభుత్వ పాఠశా లలో చదువుతున్న విద్యా ర్థులు తమ సత్తా చాటుకు ని అత్యధిక మార్కులు సాధించి,మట్టిలో మాణిక్యా లుగా ఖ్యాతి గాంచిన మేఘన,సుమయ,బి.ఈశ్వర్ ల ను ముజఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దే వాలయం కమిటీ బృందం ఆధ్వర్యంలో అధ్యక్షులు దాసరి మెహన్ ఒక ప్రకటనలో అభినందనలు తెలి యచేశారు.గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగ తి ఫలితాలు విడుదల అయ్యాయి.ఈ నేపథ్యంలో కర్నూలు నగరం,32వ వార్డు,ముజఫర్ నగర్,జిల్లా ప రిషత్ ఉన్నత పాఠశాలలో విద్య నభ్యసిస్తున్న విద్యా ర్థులు మేఘన,సుమయ,బి. ఈశ్వర్ లు తమ ప్రతిభ చాటుకున్నారు.ప్రధమ స్థానంలో మేఘన (540/60 0),ద్వితీయ స్థానంలో సుమయ (509/600),తృతీ య స్థానంలో బి.ఈశ్వర్ (501/600) సాధించడం వారి తల్లితండ్రులు,పాఠశాల,32వ వార్డ్ కు గర్వకార ణం అని ఆయన కొనియాడారు.
Comments
Post a Comment