హైదరాబాద్లో భారీ డ్రగ్స్ రాకెట్ను ఛేదించిన ఎన్సీ బీ...మౌలాలిలో రూ.17.40 కోట్ల విలువైన అల్ప్ర జో లామ్ స్వాధీనం...
హైదరాబాద్లో భారీ డ్రగ్స్ రాకెట్ను ఛేదించిన ఎన్సీబీ
మౌలాలిలో రూ.17.40 కోట్ల విలువైన అల్ప్ర జో లామ్ స్వాధీనం
కల్లులో కల్తీ చేసేందుకు డ్రగ్స్ తయారు చేస్తు న్నట్లు వెల్లడి
ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు
హైదరాబాద్,మౌలాలిలో కల్లులో కల్తీ తయారు కోసం అల్ప్ర జోలామ్ ను ఉపయోగిస్తున్న భారీ డ్రగ్స్ రాకె ట్ను ఎన్సీబీ అధికారులు గుట్టు రట్టు చేశారు.దా డుల్లో రూ.17.40 కోట్ల విలువైన స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అధికారులు అదుపులోకి తీ సుకున్నారు...ఎన్సీబీ అధికారుల కథనం ప్రకారం... మౌలాలిలోని ఓ పారిశ్రామిక యూనిట్లో డ్రగ్స్ త యారు చేస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు.అక్కడి రెండు ప్లాస్టిక్ డ్రమ్ము ల్లో దాచి ఉంచిన అల్ప్రజోలామ్ను గుర్తించారు.వే సవిలో కల్లుకు ఉండే అధిక డిమాండ్ను లక్ష్యం గా చేసుకుని,కల్లులో కల్తీ చేసేందుకు ఈ డ్రగ్స్ను భారీ ఎ త్తున తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది.ఈ కల్తీ కల్లు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుం దని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.అరెస్ట్ అ యిన ముగ్గురిలో డ్రగ్స్ తయారీలో నైపుణ్యం ఉన్న కెమిస్ట్,ముడి పదార్థాలు సరఫరా చేసే వ్యక్తి,తయా రైన డ్రగ్స్ను స్వీకరించే వ్యక్తి ఉన్నట్లు ఎన్సీబీ అధి కారులు తెలిపారు.వీరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ డ్రగ్స్ నె ట్వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.రాష్ట్రంలో ఎక్కడికి సరఫరా చేస్తున్నారనే కోణంలో విచారణ కొ నసాగుతోంది.
Comments
Post a Comment