శాయి స్పోర్ట్స్ హాస్టల్ నోటిఫికేషన్ విడుదల చేయా లి...శాయి హాస్టల్ ను తిరుపతికి తరలిస్తే ఊరుకునేది లేదు...కర్నూలులో 200మంది టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీ...
శాయి స్పోర్ట్స్ హాస్టల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి
శాయి హాస్టల్ ను తిరుపతికి తరలిస్తే ఊరుకునేది లేదు
కర్నూలులో 200మంది టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీ
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్టల్కు అడ్మిషన్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాల ని,కర్నూలు సెంటర్ ను యథాతథంగా కొనసాగిం చాలని డిమాండ్ చేస్తూ ఆదివారం టైక్వాండో క్రీడాకా రులు భారీ నిరసన ర్యాలీ నిర్వ హించారు.కర్నూలు ఔట్ డోర్ స్టేడియం నుంచి ధర్మపేట నుంచి పాత ఎస్పీ ఆఫీస్,ఆర్ఎస్ రోడ్డు సర్కిల్ వరకు కొనసాగి అక్కడ నుంచి మరలా తిరిగి కర్నూలు చేయడానికి చేరుకుంది.ఈ ర్యాలీలో 200మందికి పైగా క్రీడాకారు లు,కోచ్లు,క్రీడాభిమానులు పాల్గొన్నారు.ర్యాలీ అనం తరం ఔట్ డోర్ స్టేడియం వద్ద క్రీడా సంఘాల ప్రతి ని ధులు నాగరత్నమయ్య,సునీల్,వెంకటేష్,సతీష్,ఆ రిఫ్ లు మీడియాతో మాట్లాడారు.ప్రతి ఏటా ఈ సమ యానికి శాయి హాస్టల్ అడ్మిషన్ నోటిఫికేష న్ వచ్చే ది.ఈసారి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? కావాలనే నోటిఫికేషన్ ఇవ్వకుండా సెంటర్ను తిరుపతికి తరలించే కుట్ర జరుగుతోంది అని వారు ఆరోపించా రు.రాయలసీమ జిల్లాల్లోని గ్రామీణ,పేద,మధ్యత రగతి క్రీడాకారులకు కర్నూలు శాయి సెంటర్ ఒక్కటే ఆధారమని,ఇ క్కడ ఉచితంగా వసతి,భోజనం,కోచిం గ్ అందు తుందని క్రీడాకారులు తెలిపారు.తిరుపతికి తర లిస్తే మాలాంటి వాళ్లం క్రీడలకు దూరం కావాల్సిం దే.ప్రయాణ ఖర్చులు,వసతి భరించే స్థోమత మాకు లేదు” అని ఓ జాతీయ స్థాయి టైక్వాండో క్రీడాకారిణి గాయత్రి మాపోయింది.అడ్మిషన్ నోటి ఫికేషన్ ఇవ్వ కుండా శాయి సెంటర్ను తిరుపతికి తరలిస్తే రాయల సీమ వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని,నిరా హా ర దీక్షలకు కూడా వెనుకాడబోమని క్రీడా సంఘాల నే తలు ప్రభుత్వాన్ని,శాయి అధికారులను హెచ్చరించా రు.
Comments
Post a Comment