పందిపాడు ఇందిరమ్మ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం...రూ. 30 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పను లకు భూమిపూజ...ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి...
పందిపాడు ఇందిరమ్మ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం
రూ. 30 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
కల్లూరు అర్బన్,పరిధిలోని పందిపాడు,ఇందిరమ్మ కా లనీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే,టీడీపీ నంద్యాల జి ల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి పేర్కొన్నారు.శు క్రవారం 35వ వార్డులోని గోడల ఆంజనేయస్వామి దే వాలయం సమీపాన ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ వ ద్ద పందిపాడు లే అవుట్ లో డబ్ల్యూ బిఎం రోడ్డు ని ర్మాణ పనులకు ఆమె భూమిపూజ నిర్వహించారు. స్థానిక ప్రజలు తమ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధే ధ్యేయం :
సుమారు రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూ జలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడా రు.నియోజకవర్గంలోని ప్రతి వార్డులో మౌలిక సదుపా యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని,గత ప్రభు త్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన కాలనీలను ఇప్పు డు,అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చా రు.ప్రజల అవసరాలను గుర్తించి సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
హాజరైన నేతలు :
టీడీపీ యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.పందిపాడు ఇందిరమ్మ కాలనీ వాసులు, 35వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన,బీజేపీ నాయ కులు భారీ సంఖ్యలో పాల్గొ న్నారు.
Comments
Post a Comment