కల్లూరు 41వ వార్డులో రూ.60లక్షల సీసీ డ్రైన్ పను లకు శ్రీకారం...భూమిపూజలో ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి...
కల్లూరు 41వ వార్డులో రూ.60లక్షల సీసీ డ్రైన్ పనులకు శ్రీకారం
భూమిపూజలో ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి
కల్లూరు మండలం,41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీ ఎబినేజర్ చర్చి లైన్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద రూ.60లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం నిర్వహిం చారు.కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే,టీడీపీ నంద్యా ల జిల్లా అధ్యక్షురాలు గౌరుచరితా రెడ్డి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షు రాలు కమ్మరి పార్వతమ్మ,టీడీపీ యువ నాయకులు గౌరు జనార్ధన్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబు లేష్ కూడాహాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భం గా అభివృద్ధి పనులు వేగవంతం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.అనంతరం స్థాని క ప్రజలు ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి కాల నీలో నీటి నిల్వ సమస్యలు నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి కె.జనార్ధన్ ఆచారి, 41వ వార్డు ఇన్చార్జి నాగేశ్వరరావు,37 వ వార్డు ఇన్ చార్జి సుతారు రాఘవేంద్ర,టీడీపీ సీనియర్ నాయకు లు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నా రు.
Comments
Post a Comment